TTD:తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అన్నీ కంపార్ట్ మెంట్లు ఫుల్…


ఏడు కొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే.. తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.నిన్నటివరకు శ్రీవారి బ్రహోత్సవాల నేపథ్యంలో కొండపైకి పరిమితి సంఖ్యలోనే వాహనాలను అనుమతించారు. అయితే.. నిన్న బ్రహోత్సవాలు ముగియడంతో.. ఇవాళ భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే.. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి పోయి.. వెలుపల ఉన్న క్యూలైన్లలో సైతం భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది.
అయితే.. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నపానీయాలను క్యూలైన్లలోనే అందజేస్తున్నారు టీటీడీ అధికారులు. అయితే రద్దీని గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న స్వామి వారిని 72,195 మంది దర్శించుకున్నారు. అంతేకాకుండా.. 41,071 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. రూ.2.17 కోట్ల హుండీ ఆదాయం స్వామి వారి ఖాతాలో సమకూరింది.