“సోషల్ మీడియా” నీకో దండం…

*ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసింది, ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన వైష్ణవి దాస్*
*సోషల్ మీడియాని వీడండి, ర్యాంకులు సాధించండి*
*సోషల్ మీడియా మాయలో యువత జీవితాలు నాశనం*
*ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ వద్దు, చదివే ముద్దు*
దేశం లో యువత అందరు సోషల్ మీడియా పై ఆసక్తితో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.చదువుకునే వయసులో ఎక్కువ సమయం చదువుకేటాయించాల్సింది పోయి, “సోషల్ మీడియా” ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సప్ లో ఎక్కువ సమయం కేటాయించి వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాకు ఉపయోగించే సమయాన్ని నిజంగా చదువుకు ఉపయోగిస్తే ఏం జరుగుతుందో కర్ణాటకకు చెందిన వైష్ణవి దాస్ నిరూపించింది.”సోషల్ మీడియాకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని కర్ణాటక చెందిన వైష్ణవి దాస్ నిరూపించారు. నీట్ రీటెస్ట్ 2026 లో 720 మార్కులకు 700 మార్కులు తెచ్చుకొని ఆల్ ఇండియా 20 వరకు సాధించింది. వైష్ణవి దాస్ మాట్లాడుతూ,, తాను ఇంస్టాగ్రామ్ కు దూరంగా ఉండటం వల్లనే ఈ ర్యాంకు సాధించానని చెప్పుకొచ్చింది. నా విజయానికి ప్రశంసలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.సోషల్ మీడియా మాయలో పడి యువత చదువుపై ఆసక్తి చూపడం తగ్గింది. యువత ఇప్పుడుకైనా మేల్కొని సోషల్ మీడియా వదిలిపెట్టి చదువుపై మక్కువ చూపండి.
*తల్లిదండ్రుల ఆవేదన*
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల్ని ఎంతో ప్రయోజకుల్ని చేయాలని, తమ కష్టాన్ని పిల్లలకు తెలియకుండా చదివిస్తూ ఉంటే పిల్లలు మాత్రం సోషల్ మీడియాకు అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకొని ఫెయిల్యూర్ జీవితానికి దగ్గరవుతున్నారు. యువత తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించి అలా జరగకుండా చూసుకోవాలని కోరారు. కర్ణాటకకు చెందిన వైష్ణవి దాసుని ఆదర్శంగా తీసుకొని యువత మారాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు.
