The post త్రిదోష మూల వటి… appeared first on 9Staar TV.
]]>
చాలామంది బీపీ (BP),షుగర్ (diabetes) మరియు శరీర శుద్ధి (Detox) కోసం వేర్వేరు మందులు వాడుతూ ఉంటారు….కానీ ఈ మూడు సమస్యలను ఒకే ఫార్ములాతో వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి రూపొందించిన సంపూర్ణ ఆయుర్వేద ఔషధమే — *”త్రిదోష మూల వటి”*.
* BP నియంత్రణకు సహాయపడుతుంది
* షుగర్ లెవెల్స్ సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతుంది
* శరీరంలో ఉన్న మలినాలను తొలగించి Detox చేస్తుంది
* శరీరానికి సహజ శక్తి & ఉత్సాహాన్ని అందిస్తుంది
*త్రీదోష మూల వటిలో ఉపయోగించే ముఖ్యమైన 26 మూలికలు:*
సర్పగంధ, అర్జున, అశ్వగంధ, జటామాంసి, బ్రాహ్మి, శంఖపుష్పి, కృష్ణ తులసి, పునర్నవ, గోక్షుర, మధునాశిని, తిప్పతీగ, నేరేడు గింజలు, మెంతులు, కాకరకాయ, నేలవేము, వేప, త్రిఫల, దాల్చిన చెక్క, విజయసార, భూమ్యామలకి, కరివేపాకు, కస్తూరి పసుపు, అవిసె గింజలు, గుగ్గులు, వెల్లులి, ఆమ్లా వంటి అద్భుతమైన ఆయుర్వేద జడిబుటీలు.
*తయారీ & వాడే విధానం:*
పై తెలిపిన 26 ఆయుర్వేద మూలికలన్నింటినీ శుభ్రంగా కడిగి, నీడలో బాగా ఎండబెట్టి సన్నని చూర్ణంగా తయారు చేయాలి. తర్వాత అన్ని చూర్ణాలను సమపాళ్లలో బాగా కలిపి రెండు భాగాలుగా విభజించాలి.
* ఒక భాగాన్ని చూర్ణం రూపంలోనే నిల్వ చేసుకోవాలి.
* మరో భాగాన్ని గోరువెచ్చని నీటితో కలిపి చిన్న చిన్న మాత్రలు (వటి)గా తయారు చేసి నీడలో ఎండబెట్టాలి.
*తీసుకునే విధానం*
* *ఉదయం –* ఒక చెంచా చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
* *రాత్రి –* ఒక మాత్ర (వటి)ను గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.
క్రమం తప్పకుండా మూడు నెలలు వాడితే, మీ BP & షుగర్ అద్భుతంగా నియంత్రణలో ఉంటుంది.
*ఈ అద్భుతమైన మందును ఇంట్లో తయారు చేసుకోగలిగిన వారు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసి కొరియర్ ద్వారా పంపిస్తాము. 9392857411 గల నెంబర్కు వాట్సప్ లేదా కాల్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు.*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. వెంకటేశ్వరరావు 9392857411.*
The post త్రిదోష మూల వటి… appeared first on 9Staar TV.
]]>The post వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు… appeared first on 9Staar TV.
]]>
‘రస్ అల్ ఖైమా’కు మరో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
యూఏఈ కోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నాటి వాన్పిక్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు మరోసారి చుక్కెదురైంది.
ఈ వ్యవహారంలో రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా) పేరు మీద మరో రూ.200 కోట్లను అదనపు సెక్యూరిటీ డిపాజిట్లను జమచేయాలని ఆయనను, మరో నాలుగు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం
ఈ ఆదేశాలు జారీచేసింది. నిమ్మగడ్డ, ఇతరులు రాకియా సంస్థకు రూ.950కోట్లు చెల్లించాలని యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కోర్టు ఇచ్చిన తీర్పు అమలులో భాగంగా తాజా ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జమానాలో వాన్పిక్ ప్రాజెక్టు (వాడరేవు అండ్ నిజాంపట్నం పారిశ్రామిక కారి డార్) మొగ్గ తొడిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ నేతృత్వంలోని మ్యాటిక్స్ ఎక్స్పోర్ట్స్ 49శాతం, రాకియా 51శాతం వాటాతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇందుకోసం అప్పటి గుంటూరు, ప్రకాశం జిల్లాల తీరప్రాంతంలో దాదాపు 13,221 ఎకరాలు సేకరించారు. ప్రాజెక్టులో భాగంగా రూ.16,000 కోట్ల నుంచి రూ.17,000 కోట్ల పెట్టుబడులతో నౌకాశ్రయం, పెద్ద పారిశ్రామిక సముదాయం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ భూసేకరణ తీరుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత వాన్పిక్ ప్రాజెక్టు భూసేకరణ లొసుగులన్నీ బయట పడ్డాయి. వాన్పిక్ వ్యవహారంలో వైఎస్ కుమారుడు జగన్ అంటకాగిన నిమ్మగడ్డ ప్రసాద్కు కొన్నాళ్ల పాటు జైలు జీవితం తప్పలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే యూఏఈ కంపెనీ రాకియా ఈ ప్రాజెక్టు కోసం తాము పెట్టిన పెట్టుబడులను దుర్వినియోగం చేశారని
ఆ దేశంలోని కోర్టులను ఆశ్రయించి, రూ.950 కోట్లకు డిక్రీ తెచ్చుకుంది. ఈ ఆదేశాలను అమలు చేయాలని భారత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీం కోర్టు ఇంతకు ముందే రూ.212 కోట్లు డిపాజిట్ చేయాలని నిమ్మగడ్డ ప్రసాద్ను ఆదేశించింది. ఇప్పుడు దానికి మరో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
The post వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు… appeared first on 9Staar TV.
]]>The post బొగ్గు మసిలో విరిసిన నవ్వు… లారీ క్యాబిన్ సాక్షిగా గెలిచిన అక్షరం! appeared first on 9Staar TV.
]]>
రహదారి పక్కన నిలిచిన లారీ… చేతిలో ఆవిర్లు కక్కే ఒక చిన్న పేపర్ టీ కప్పు… ముఖమంతా వికసిస్తూ పెల్లుబికిన ఒక కల్మషం లేని నవ్వు. నేడు సామాజిక మాధ్యమాల్లో కోట్ల మందిని నవ్విస్తున్న ఒక వైరల్ మీమ్ అది. కానీ, క్షణికావేశాల రీల్స్ విపణి చూడలేని ఒక అసలుసిసలైన జీవన సంగ్రామం ఆ నవ్వు వెనుక దాగి ఉంది.
ఆ కుర్రాడి పేరు అరుణ్ కుమార్. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాముత్తారం మండలం, కర్లకుంట గ్రామానికి చెందిన ఒక సామాన్య శ్రామిక బిడ్డ. కుటుంబ కటిక పేదరికం పదేళ్ల పసిప్రాయంలోనే పలకా బలపాన్ని లాగేసుకుని, నాలుగో తరగతితోనే బడికి దూరం చేసింది. బొగ్గు గనుల దుమ్ము, లారీ చక్రాల కింద క్లీనర్గా కాయకష్టం అతడికి నిత్య జీవితంగా మారాయి.
అదే బొగ్గు లోడింగ్ పాయింట్ వద్ద రోజంతా చెమటోడ్చి, స్నానం చేసి కొత్త చొక్కా తొడుక్కున్న వేళ… టీ తాగుతూ లారీ డ్రైవర్ నెహ్రూ వేసిన ఒక చిన్న జోక్కు అరుణ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. కొత్త బట్టలు ఎక్కడ పాడవుతాయోనన్న అమాయకపు భయంతో టీ కప్పును కాస్త దూరంగా జరుపుతూ అతడు నవ్విన ఆ నవ్వులో పేదరికం గీసిన గీతలు లేవు, రేపటి గురించిన దిగులూ లేదు; నిష్కల్మషమైన అమాయకత్వం మాత్రమే ఉంది. ఆ కొన్ని క్షణాలను నెహ్రూ తన ఫోన్ కెమెరాలో బంధించి సరదాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది కోట్ల మంది హృదయాలను తాకిన వైరల్ దృశ్యంగా మారింది. నేడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఎవరు కామెడీ రీల్ చేసినా, కితకితలు పెట్టే ఒక యూనివర్సల్ రియాక్షన్ మీమ్గా ఆ ముఖం స్థిరపడిపోయింది.
అయితే, ఈ కథ అక్కడితో ముగిసిపోలేదు. కోట్ల మంది రీల్స్ చేసుకుంటూ ఆ నవ్వుతో కాలక్షేపం చేస్తుంటే, ఆ వీడియో కింద వచ్చిన వేలాది కామెంట్లను కూడా చదవలేని అరుణ్ నిరక్షరాస్యతను చూసి లారీ డ్రైవర్ నెహ్రూ మనసు కదిలిపోయింది. తనూ పేదరికం వల్ల చదువు ఆపేయాల్సి వచ్చిన బాధను ఎరిగిన నెహ్రూ, అరుణ్ జీవితం లారీ చక్రాల కిందే ముగిసిపోకూడదని సంకల్పించాడు. ప్రయాణాల బడలిక నడుమ లారీ క్యాబిన్నే తరగతి గదిగా మార్చాడు. హైవేల పక్కన లారీ హెడ్లైట్ల వెలుతురులో అక్షరాలు నేర్పించాడు, పుస్తకాలు కొనిచ్చాడు, ఫీజులు చెల్లించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాయింపజేశాడు. అరుణ్ పదో తరగతి గడప దాటి తన జీవితంలో అసలైన గెలుపును అందుకున్నాడు.
డిజిటల్ విపణి ఆ నవ్వును వాడుకుని కోట్ల వ్యూస్ ఆర్జించుకుంది కానీ, అతనికి ఏ రాయల్టీనీ ఇవ్వలేదు. అయితేనేం… ఈ వర్చువల్ ప్రపంచపు కృత్రిమ లెక్కలతో సంబంధం లేకుండా, లారీ క్యాబిన్ నుంచి మొదలైన ఆ అక్షర ప్రయాణం అరుణ్ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టింది. గురువుగా మారిన ఒక లారీ డ్రైవర్ హృదయ సంస్కారానికి, పట్టుదలతో నిలబడ్డ ఒక శ్రామిక బాలుడి సంకల్పానికి ఇది నిలువెత్తు నిదర్శనం.
పేదరికం, కష్టాలు ఎన్ని చీకట్లను సృష్టించినా… సంకల్పం, మంచి మనుషుల తోడు ఉంటే ఆత్మవిశ్వాసం చిగురిస్తుందనడానికి అరుణ్ జీవన ప్రయాణమే ఒక తిరుగులేని స్ఫూర్తి. ఆనాడు బొగ్గు మసిని దాటుకుని రోడ్డు పక్కన వికసించిన ఆ స్వచ్ఛమైన నవ్వు, రేపటి విజయాల వైపు సాగుతూ నవ సమాజానికి వెలుగులు పంచుతూ ఎప్పటికీ అలాగే పదిలంగా వెలగాలి.
జీవితంలో ఎప్పుడైనా అరుణ్ ఎదురైతే గట్టిగా హత్తుకోవాలనే మాబోటి వారి ఆకాంక్ష వెనుక..ఈ సమాజానికి నిస్వార్థంగా నవ్వును, శ్రమను, సమయాన్ని ధారపోసే అసంఖ్యాక శ్రామికుల పట్ల ఉండే ప్రగాఢమైన గౌరవం ఉంది. లోకం ఆ శ్రమకు తగిన విలువ కట్టకపోయినా, మానవత్వపు విలువ ఎప్పటికీ నిత్యనూతనంగా వర్ధిల్లుతూనే ఉంటుంది.
The post బొగ్గు మసిలో విరిసిన నవ్వు… లారీ క్యాబిన్ సాక్షిగా గెలిచిన అక్షరం! appeared first on 9Staar TV.
]]>The post ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే… appeared first on 9Staar TV.
]]>
ఈ లోటుపాట్లను మన జీవనశైలికి అనుగుణంగా భర్తీ చేసుకోవడానికి ఆయుర్వేదంలో ఎన్నో సహజమైన మార్గాలు ఉన్నాయి.
అందులో ముఖ్యమైన కొన్ని విషయాలను కింద తెలియజేస్తున్నాం. ఒక్కసారి చూడండి.
*
టీనేజ్ పిల్లలకు:*
* *”సర్వశుద్ధి వట్టి + సహజ సంపూర్ణ పోషణ”*
*
30–40 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి:*
* *”సర్వశుద్ధి వట్టి + ఆరోగ్య సంజీవని”*
*
50 సంవత్సరాలు పైబడినవారికి:*
* *”సర్వశుద్ధి వట్టి + నిత్య యవ్వనాది”*
మీకు ప్రస్తుతం ఎటువంటి అనారోగ్యం లేకపోయినా, శరీరాన్ని శుద్ధి చేసి అవసరమైన పోషకాలను అందించేందుకు ఈ కాంబినేషన్లను చాలా బాగా పనిచేస్తుంది
సంవత్సరానికి కనీసం 1–2 నెలలు వాడితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
*”వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వ్యాధి రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమం.”*
*పైన తెలిపిన అద్భుతమైన మందును ఫార్ములాను ఇంట్లో తయారు చేసుకోవాలనుకునేవారు మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఫార్ములా అందిస్తాము మీరు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసే కొరియర్ ద్వారా పంపిస్తాము. 9392857411 గల నెంబర్కు వాట్సప్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు దయ చేసి కాల్ చేయకండి.*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*వెంకటేశ్వరరావు 9392857411.*
The post ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే… appeared first on 9Staar TV.
]]>The post భారతదేశ ఆరోగ్యరంగం కుప్పకూలే అంచున ఉంది… appeared first on 9Staar TV.
]]>
చాలా తీవ్రమైన విషయం
భారతదేశ ఆరోగ్యరంగం కుప్పకూలే అంచున ఉంది — ఈ విషయం భారత పార్లమెంటరీ కమిటీ కూడా అంగీకరించింది.
Zee న్యూస్ తాజాగా విడుదల చేసిన ఒక పరిశోధన నివేదిక ప్రకారం, భారతదేశంలో జరిగే మానవ శస్త్రచికిత్సల్లో సుమారు 44% నకిలీ, మోసపూరితమైనవి లేదా అవసరం లేనివి.
అంటే దేశంలో జరిగే ఆపరేషన్లలో దాదాపు సగం రోగులను లేదా ప్రభుత్వాన్ని దోచుకోవడానికే చేస్తున్నారన్న మాట.
నివేదిక ప్రకారం:
గుండె శస్త్రచికిత్సల్లో – 55%
గర్భాశయ తొలగింపు (హిస్టరెక్టమీ) – 48%
క్యాన్సర్ ఆపరేషన్లు – 47%
మోకాళ్ల మార్పిడి – 48%
సిజేరియన్ డెలివరీలు – 45%
భుజం, వెన్నెముక మొదలైన మరెన్నో ఆపరేషన్లు – నకిలీ లేదా అవసరం లేనివి.
మహారాష్ట్రలోని పలు ప్రసిద్ధ ఆసుపత్రులపై జరిగిన సర్వే ప్రకారం, పెద్ద ఆసుపత్రుల్లో ఉన్న సీనియర్ వైద్యులకు నెలకు ₹1 కోటి వరకు జీతం ఇస్తున్నారు.
కారణం: ఎక్కువ టెస్టులు, చికిత్సలు, ఆసుపత్రి చేరికలు లేదా ఆపరేషన్లు సూచించే వైద్యులకే ఎక్కువ జీతం ఇస్తారు — అవి అవసరం ఉన్నా లేకపోయినా.
(మూలం: BMJ Global Health)
The Times of India నివేదిక ప్రకారం, కొన్ని ఆసుపత్రుల్లో మరణించిన రోగులను సజీవులుగా చూపించి చికిత్స పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు — ఇది అత్యంత దారుణమైన చర్య.
ఒక ఘటనలో, ఒక ప్రముఖ ఆసుపత్రి 14 ఏళ్ల బాలుడిని మరణించినప్పటికీ ఒక నెలపాటు వెంటిలేటర్పై ఉంచి “చికిత్స” కొనసాగించింది.
తరువాత అతను మృతుడని ప్రకటించగా, ఆసుపత్రిని దోషిగా తేల్చి కుటుంబానికి ₹5 లక్షల పరిహారం ఇచ్చారు — కానీ వారి మానసిక వేదనకు ఎవరూ పరిహారం ఇవ్వగలరా?
కొన్ని ఆసుపత్రులు మరణించిన రోగులపై తక్షణ శస్త్రచికిత్స అవసరమని చెప్పి, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకుని, తర్వాత “ఆపరేషన్ సమయంలో మరణించాడు” అని ప్రకటిస్తారు.
ఇలా భారీ మొత్తాలు దోచుకుంటారు.
(మూలం: Dissenting Diagnosis – డాక్టర్ గద్రే & డాక్టర్ శుక్లా)
హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లెయిమ్) మోసం
ఇది కూడా అంతే భయంకరమైన విషయం.
భారతదేశంలో సుమారు 68% మందికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ, అవసరమైనప్పుడు క్లెయిమ్ తిరస్కరించబడుతుందో లేదా కొంతమాత్రమే చెల్లిస్తారో.
మిగతా ఖర్చు కుటుంబం భరించాల్సి వస్తుంది.
సుమారు 3,000 ప్రసిద్ధ ఆసుపత్రులు నకిలీ క్లెయిమ్ల కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీల చేత బ్లాక్లిస్ట్ చేయబడ్డాయి.
కోవిడ్ సమయంలో అనేక పెద్ద ఆసుపత్రులు నకిలీ కోవిడ్ కేసులు సృష్టించి బీమా కంపెనీలను మోసం చేశాయి.
మానవ అవయవాల అక్రమ రవాణా
ఇది భారీ స్థాయిలో జరుగుతోంది.
2019లో ఇండియన్ ఎక్స్ప్రెస్ బయటపెట్టిన సంఘటనలో — కన్పూర్కు చెందిన సంగీతా కశ్యప్ అనే మహిళను ఉద్యోగం పేరుతో ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆమెను “హెల్త్ చెక్అప్” పేరుతో ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్చారు.
అదృష్టవశాత్తూ, వైద్యులు “డోనర్” అనే పదం వాడటం విని ఆమె తప్పించుకుంది.
ఆమె ఫిర్యాదు తరువాత డాక్టర్లు, సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్న అంతర్జాతీయ అవయవ రవాణా ముఠా బయటపడింది.
హాస్పిటల్ రిఫరల్ మోసం
కొంతమంది వైద్యులు రోగికి తీవ్రమైన వ్యాధి ఉందని అబద్ధం చెబుతూ పెద్ద ఆసుపత్రులకు పంపిస్తారు.
అపోలో, ఫోర్టిస్, ఏపెక్స్ వంటి ఆసుపత్రులు ఈ రిఫరల్ ప్రోగ్రాంలు నడుపుతాయి.
ఉదాహరణకు, ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ ఇచ్చిన ఆఫర్లు:
40 రోగులను పంపితే ₹1 లక్ష,
50 రోగులకు ₹1.5 లక్షలు,
75 రోగులకు ₹2.5 లక్షలు.
రోగి పరిస్థితి ఏదైనా కావచ్చు — వైద్యుడికి రిఫరల్ ఫీజు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమవుతుంది.
డయాగ్నస్టిక్ టెస్టుల మోసం
ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారం.
బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ల్యాబ్పై ఆదాయపు పన్ను దాడిలో ₹100 కోట్లు నగదు, 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు — ఇవన్నీ వైద్యులకు లంచం ఇవ్వడానికి ఉంచినవే.
డాక్టర్లు అవసరం లేని టెస్టులు సూచించి 40–50% కమిషన్ తీసుకుంటారు.
చాలా టెస్టులు కాగితాలపై మాత్రమే ఉంటాయి.
అందుకే భారతదేశంలో 2 లక్షలకు పైగా ల్యాబ్లు ఉన్నప్పటికీ, కేవలం 1,000 మాత్రమే సర్టిఫైడ్.
ఔషధ కంపెనీల అవినీతి
సుమారు 20–25 పెద్ద ఔషధ కంపెనీలు ప్రతి సంవత్సరం ₹1,000 కోట్లు వైద్యులపై ఖర్చు చేస్తాయి.
కోవిడ్ సమయంలో డోలో టాబ్లెట్ తయారీ కంపెనీ కూడా ఇలాంటి మోసంలో పట్టుబడింది.
వైద్యులు తమ ఔషధాలను సూచించేందుకు క్యాష్, విదేశీ పర్యటనలు, 5 స్టార్ హోటల్లో లగ్జరీ స్టేలు ఇస్తారు.
ఉదాహరణకు, USV Ltd. ప్రతి వైద్యుడికి ₹3 లక్షల నగదు లేదా ఆస్ట్రేలియా/అమెరికా టూర్ ఇస్తుంది.
హాస్పిటల్ – ఔషధ కంపెనీ గూటి మోసం
చాలా కంపెనీలు ఆసుపత్రులకు మందులు, పరికరాలు తక్కువ ధరకు విక్రయిస్తాయి, కానీ ఆసుపత్రులు వాటిని రోగులకు 10 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతాయి.
ఇండియా టుడే బయటపెట్టిన ఉదాహరణ:
EMCURE కంపెనీ తయారు చేసిన క్యాన్సర్ ఔషధం Temicure ఆసుపత్రులకు ₹1,950కు విక్రయిస్తే,
రోగులకు ₹18,645 వసూలు చేశారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)
2016లో ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలో, MCI కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చినా, వైద్యులను మరియు ఆసుపత్రులను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొంది.
MCI నిబంధనలలో (చాలా సార్లు ఉల్లంఘింపబడేవి):
1. వైద్యులు బ్రాండెడ్ మందులు కాకుండా జనరిక్ మందులు మాత్రమే సూచించాలి.
2. చికిత్సకు ముందు ఫీజు వివరాలు వెల్లడించాలి.
3. ప్రతి పరీక్ష లేదా చికిత్సకు ముందు రోగి అనుమతి తప్పనిసరి.
4. రోగి రికార్డులు కనీసం 3 సంవత్సరాలు నిల్వ చేయాలి.
5. అనైతికంగా లేదా అనర్హంగా వ్యవహరించే వైద్యులను నివేదించాలి.
ప్రభుత్వ పథకాలలో అవినీతి
అగ్నివీరులు, మాజీ సైనికులు వంటి వారు కూడా ప్రభుత్వ పథకాల కింద నకిలీ ఆసుపత్రి చేరికలకు గురవుతున్నారు.
లక్షల రూపాయల నకిలీ బిల్లులు రూపొందించి ప్రభుత్వం, ఆసుపత్రులు, అవినీతి అధికారులు డబ్బు పంచుకుంటున్నారు.
ఈ సందేశం ప్రతి పౌరుడికి చేరాలి.
తమను మరియు తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈ నిజాలు తెలుసుకోవాలి.
Source…….

The post భారతదేశ ఆరోగ్యరంగం కుప్పకూలే అంచున ఉంది… appeared first on 9Staar TV.
]]>The post భర్తకు రోజు మత్తుమందు పెట్టి ప్రియుడుతో సరసాలు… appeared first on 9Staar TV.
]]>
. కానీ 8 మంది పోలీసులు సాక్షిగా పెద్దమనుషుల సాక్షిగా రాత్రి ఒంటి గంటకి తన ఇంట్లోనే పక్కగదిలో అత్తమామలు ఉండగానే బెడ్ రూమ్ లోకి దూరిన ప్రియుడిని భర్త పట్టించాడు. ఇద్దరూ నగ్నంగా ఉన్న దశలోనే పట్టించాడు. ఇద్దరినీ బట్టలు కట్టించి పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు. పెళ్లయిన తర్వాత రెండు వారాల నుంచి భర్తకు ఎందుకో అనుమానం వచ్చింది. పగలు ఒళ్లంతా అన్నినీరసంగా ఉండడం, పగలు పనిచేసుకోలేక పోవడం ఎందుకు ఇలా అవుతుందని బాధపడేవాడు. ఈ లోగా పగటిపూట ఆమె నిత్యం సెల్ఫోన్లో చాటింగ్ చేయడం మాట్లాడుకోవడం చూసి కూడా అనుమానం వచ్చింది.
ఓ రోజు తన చిన్నాన్న చనిపోవడంతో పక్క ఊరికి వెళ్లి రాత్రి ఒంటిగంటకు వచ్చే సమయంలో ఇంట్లో ప్రియుడుతో భార్య తన బెడ్ రూమ్ లోనే సరసాల్లో ఉంది . వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు . గత నెల రోజులుగా రోజు ఈ కార్యక్రమం జరిగిపోతుందని కొత్త పెళ్లికూతురు కూడా ఒప్పుకుంది. తాను ప్రియుడిని వదిలి ఉండలేనని పోలీసులు వదిలేస్తే ఇద్దరం వెళ్ళిపోతామని కూడా ధైర్యంగానే చెప్పింది. ఇంతకీ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ పరిధిలో చర్గవ్ లో జరిగింది..
The post భర్తకు రోజు మత్తుమందు పెట్టి ప్రియుడుతో సరసాలు… appeared first on 9Staar TV.
]]>The post హిందు మహిళలే టార్గెట్ గా సాదిక్ అక్రమాలు, appeared first on 9Staar TV.
]]>
పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్మ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. గత కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నూకరాజు తన భార్య, కుమార్తె, మనవడితో సహా గత ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్కం రైలు బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో దూకిన సంగతి తెలిసిందే. ఇది తెలిసిన తర్వాత సాదిక్ వెంటనే పరారయ్యారు. మొబైల్ ఫోన్ వాడకుండా ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సాదిక్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని పట్టుకునేందుకు కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి పది ప్రత్యేక బృందాలు వెళ్లాయి. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబయి, ఢిల్లీలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆరు రోజులుగా అణువణువూ గాలించాయి. ఈ క్రమంలో నిందితుడు ఢిల్లీలో పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. సాదిక్ను అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చి.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అయితే సాదిక్ను పోలీసులే వెతికి పట్టుకున్నారా? లేదా కొందరు ముస్లిం మతపెద్దల సూచనల మేరకు అతడే పట్టుబడ్డాడా? అనే విషయంపై స్పష్టత లేదు. ఢిల్లీ నుంచి ఇక్కడకు తీసుకువచ్చేందుకు 24 గంటల సమయం పట్టనున్నట్టు తెలిసింది. కాగా, నూకరాజు కుటుంబం ద్వారా లేదా వేరెవరి ద్వారా అయినా కానీ.. సాదిక్ ఖాన్ భారీ ఎత్తున సొమ్ములు, ఆస్తులు కూడబెట్టినట్టు తెలిసింది. వాటిని తెలివిగా తమ సోదరీమణుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్టు చెప్తున్నారు. సుమారు రూ.10 కోట్ల మేర విలువైన ఆస్తులు, కార్లు అతడి వద్ద ఉన్నట్టు తెలిసింది.సాదిక్ ఖాన్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘సాదిక్ ఖాన్ రైఫిల్ షూటరే కాదు.. అతడికి ఏమీ రాదు.. పూర్తిగా ఫేక్.. పెద్ద మోసగాడు.. అందరితోనూ గొడవలే.. దూకుడు స్వభావం.. మాటలతో మోసం చేసే తత్వం’’.. అని అతని గురించి తెలిసిన వారు చెబుతున్నారు. గతంలో అతడు పనిచేసే ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో కొందరిని వేధింపులకు గురిచేస్తే.. ఆ స్కూల్ నుంచి బయటకు పంపేశారని కూడా తెలిసింది. ఇటీవల కాకినాడలో ఓ ఫ్లాట్ కొనేందుకు రూ.25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఎలా ఇచ్చారు? ఆ సమయంలో అతడి వెంట ఎవరైనా ఉన్నారా? వంటి విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోజున సాదిక్ తనకు బాగా పరిచయం ఉన్న ఓ న్యాయవాదికి ఫోన్ చేసినట్టు గుర్తించినట్టు తెలిసింది.
The post హిందు మహిళలే టార్గెట్ గా సాదిక్ అక్రమాలు, appeared first on 9Staar TV.
]]>The post ఇది మురళీధర్-సంగీతల కథ. appeared first on 9Staar TV.
]]>
ఇది మురళీధర్-సంగీతల కథ.
– మురళీధర్ వయస్సు 24 సంవత్సరాలు, సంగీత వయస్సు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు వారికి వివాహం జరిగింది.
– మురళీధర్ పేద కుటుంబం నుండి వచ్చారు.
– తన కుటుంబ కోరికలను తీర్చడానికి ఆయన ట్రక్కు డ్రైవర్గా పనిచేశారు.
– వారు చాలా సంవత్సరాల పాటు సంతానం కోసం ఎంతో బాధపడ్డారు.
– పిల్లల కోసం వారు ‘చార్ ధామ్’ యాత్రను కూడా వెళ్లారు. మొక్కులు చెల్లించారు.
– చివరకు వారికి ఒక మగబిడ్డ పుట్టాడు, అతనికి కునాల్ అని పేరు పెట్టారు.
– తన కొడుకును ఒక మంచి పాఠశాలలో చేర్పించారు, అక్కడ కునాల్ ధనిక కుటుంబాల పిల్లలను చూశాడు.
– కునాల్ ఐఫోన్ 15 ప్రో కావాలని ఏడ్వడం మొదలుపెట్టాడు.
– మురళీధర్ EMI మీద దానిని కొనిపెట్టారు, కానీ ఆయన ఆ వాయిదాలను కట్టలేకపోయారు.
– డ్రైవింగ్ పని కారణంగా మురళీధర్ 3 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండేవారు.
– తన కుటుంబాన్ని సాఫీగా నడిపించుకోవడానికి సొంతంగా ఒక వాహనం కొని అద్దెకు ఇవ్వాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు.
– కునాల్ ఒక కొండ అంచుకు వెళ్లి, ఆ EMI కట్టాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు.
– ఆ ప్రాంతానికి వెళ్లవద్దని అతని తల్లిదండ్రులు ఎంతగానో ప్రాధేయపడ్డారు.
– చివరకు కునాల్ కాలుజారి పడిపోయాడు. అతన్ని రక్షించడానికి ప్రయత్నించిన తండ్రిని, కునాల్ చేయి పట్టుకుని లాగడంతో తండ్రి కూడా కిందపడిపోయాడు.
– తన కుటుంబం అంతా కళ్ల ముందే అలాంటి భయానక పరిస్థితిలో పడిపోవడాన్ని చూసి, సంగీత కూడా ఆ కొండపై నుంచి దూకేసింది.
– ఐఫోన్ ఈఎంఐ కారణంగా ముగ్గురూ ప్రాణాలను కోల్పోయారు.
– మంచి తల్లిదండ్రులుగా బతకడానికి జీవితం మొత్తం కష్టపడితే చివరకు మిగిలేది ఇదేనా.?
The post ఇది మురళీధర్-సంగీతల కథ. appeared first on 9Staar TV.
]]>The post సంధివర్ధన మహౌషధం… appeared first on 9Staar TV.
]]>
భరించలేని కీళ్ల నొప్పులకు, మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పులకు, మోకాళ్లలో గుజ్జురగడం వంటి అన్ని రకాల కీళ్ల వాత సమస్యలకు జీవితాంత బాధపడనవసరం లేదు,ఆపరేషన్ అంతకన్నా అవసరం లేదు..
ఈ సమస్యల అన్నిటికి ఆయుర్వేదంలో *100 ఏళ్ల* నాటికే ఒకే ఒక విశ్వసనీయ శాశ్వత పరిష్కారం చూపించింది అదే *”సంధివర్ధన మహౌషధం*
అంతే కాకుండా 50 ఏళ్లు పైబడిన వారు,ఇప్పుడిప్పుడే కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నవారు, ఎముకల అరుగుదల ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ సంధివర్ధన తయారు చేసుకుని వాడండి ఈ సంధి వర్ధన మహా ఔషధమే రేపటి మీకు కీళ్ళకు శ్రీరామ రక్ష అవుతుంది.
ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే సంధి వర్ధన మహా ఔషధం చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం.
*సంధి వర్ధన మహా ఔషధం కి కావలసిన మూలిక పదార్థాలు:-*
(క్రింద తెలియజేసే ప్రతి మూలిక పదార్థాలు మీ దగ్గరలో ఉన్న ప్రచార కొట్టు లో లేదా ఆయుర్వేదిక్ స్టోర్ లో తప్పకుండా లభిస్తాయి)
1.చిత్రమూలం వేర్ల పొడి:-100గ్రా
2.అస్వగంధ వేర్ల పొడి:-100గ్రా
3.శతావరీ పొడి:-100గ్రా
4.పల్లేరు పొడి:-100గ్రా
5.బూరుగ జిగురు:-100గ్రా
6.తుమ్మజిగురు:-100గ్రా
7.బాదాం జిగురు:-100గ్రా
8.రావి జిగురు:-100గ్రా
9.శొంటి పొడి:-100గ్రా
10.వాము పొడి:-100గ్రా
11.లోహా భస్మం:-20గ్రా
12.మండూర భస్మం:-20గ్రా
13.ఇంగువ పొడి:-10గ్రా
14.గుగ్గులు పొడి:-50గ్రా
15.గోక్షుర పొడి:-50గ్రా
16.శలాకి పొడి:-50గ్రా
17.అమలకీ:-50గ్రా
18.పునర్నవ పొడి:-50గ్రా
(ఇందులో మరికొన్ని మూలికలు వాటి యొక్క పరిమాణం వాటి యొక్క మోతాదు తోనే చాలా క్షుణ్ణంగా తీసుకోవాల్సి ఉంటుంది అది కేవలం నిపుణులకు మాత్రమే తెలిసి ఉంటుంది ఎలా తయారు చేస్తారు అని కావున వాటిని తెలియజేయడం .మీరు తయారు చేసుకునే ముందు ఒక్కసారి మీ సమస్య మాకు వివరించండి మీ శరీరం తగ్గ ఫార్ములా మీకు సూచిస్తాము గమనించగలరు).
*తయారు చేయు మరియు తీసుకునే విధానం:-*
పైన తెలిపిన అన్ని మూలికలు తీసుకొని భాగా పొడి చేసుకొని ఒక సీసాలొ భద్రపరుచుకొని,
(వాటిని మాత్రం కూడా తయారు చేసుకోవచ్చు)
ఉదయం ఒక 1/2స్పూన్,
మధ్యాహ్నం ఒక 1/2స్పూన్
రాత్రి ఒక 1/2స్పూన్,
భోజనానికి ముందు గోరవెచ్చని నీటితో తీసుకొవాలి.
ఇలా మీరు క్రమం తప్పకుండా నాలుగు నెలలు తీసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.అంతే కాకుండా మీ శరీరంలో శక్తి పెరిగి అన్ని నొప్పులు తగ్గి , మెకాళ్ళల్లో జిగురు మళ్ళీ తయారు అవుతుంది.
ఈ అద్భుతమైన మందును ఇంట్లో తయారు చేసుకోగలిగిన వారు హ్యాపీగా చేసుకోండి.తయారు చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేమే స్వయంగా తయారు చేసి కొరియర్ ద్వారా పంపిస్తాము. 9392857411 గల నెంబర్కు వాట్సప్ లేదా కాల్ చేసి మీ ఆర్డర్ ఇవ్వచ్చు.
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. వెంకటేశ్వరరావు 9392857411.
The post సంధివర్ధన మహౌషధం… appeared first on 9Staar TV.
]]>The post బడిలో భయం వద్దు.. అనురాగమే ముద్దు! appeared first on 9Staar TV.
]]>
బాల్యం కాలంతో కరిగిపోదు; మన అంతశ్చేతనలో నిశ్శబ్ద నమూనాగా స్థిరపడుతుంది. ఎంత ఎదిగినా చాలా
మందిని కుదిపేసే అభద్రత, అకారణ భయాలు, అదుపుతప్పే భావోద్వేగాల వెనుక… చిన్ననాటి గాయాలు, చేదు అనుభవాల తాలూకు ‘ట్రామా’ నీడలా వెంటాడుతోందనే చేదు నిజం చాలామందికి అర్థం కాదు. అలాంటి సున్నితమైన పసితనానికి అక్షరాల వెలుగులు పంచాల్సిన బడి గదులు, నేడు భయాందోళనల నరకకూపాలుగా మారుతుండటం సభ్యసమాజానికే తీరని కళంకం. వైజాగ్ లోని లిటిల్ గార్డెన్ ప్రైవేట్ స్కూల్లో హోంవర్క్ చేయలేదన్న భయంతో ఆరేళ్ల చిన్నారి ప్రణయ్ తేజ్ బలైపోయిన హృదయవిదారక ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం. చదువంటే సహజ వికాసం అనే ప్రాథమిక సూత్రం కనుమరుగై, శిక్షల ద్వారా విధేయతను రుద్దే దండనా సంస్కృతి పసిప్రాణాలను బలితీసుకుంటోంది.
సీసీటీవీ దృశ్యాలు విప్పిన విషాద నిజాలు
ఈ ఘటన వెనుక పరిస్థితులను, సీసీటీవీ దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తే ఎవరి హృదయమైనా ద్రవించిపోక మానదు. సుదీర్ఘ కుటుంబ ప్రయాణం ముగించుకుని తీవ్ర అలసటతో ఉన్న ఆ పసివాడి పరిస్థితిని, హోంవర్క్ సంగతిని పట్టించుకోకుండా బడికి పంపడం తల్లిదండ్రుల వైపు నిర్లక్ష్యమైతే… బడిలో ఎదురైన పరిణామాలు మరింత విచారకరం. తరగతి గదిలో మొదటి బెంచీలో కూర్చున్న ఆ పసివాడు తీవ్ర భయంతో వణికిపోతూ, చేతులు ఊపుతూ, హోంవర్క్ పుస్తకం పట్టుకుని టీచర్ వద్దకు వెళ్లే సమయానికే ఏడుస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్న పిల్లాడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాల్సింది పోయి… టీచర్ డ్రెస్ను దురుసుగా లాగి, ఏడుస్తున్నాడనే కోపంతో చెంపపై కొట్టింది. ఆ దెబ్బకు, లోపలి భయానికి తాళలేక ఆ చిన్నారి సదరు టీచర్ ఒడిలోనే స్పృహతప్పి కుప్పకూలిపోయాడు..బహుశా తనూ చాలా మంది టీచర్లు మాదిరే ఊహించని ఉపద్రవం ఇది.
పసి మనస్సులపై భయపు నీడలు
ప్రాథమిక స్థాయిలోని చిన్నపిల్లల నాడీ వ్యవస్థ అత్యంత వేగంగా రూపుదిద్దుకునే దశలో ఉంటుంది. విపరీతమైన భయానికి లేదా దండనకు గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు ఒక్కసారిగా పోటెత్తుతాయి. ఇది రక్తపోటును అకస్మాత్తుగా పెంచి, శ్వాసనాళాలను సంకోచింపజేసి, గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ప్రయాణ అలసటతో ఉన్న ప్రణయ్ తేజ్, ఆ తరగతి గదిలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తీవ్ర భయాందోళనకు గురై ఈ విధమైన నాడీ సంబంధిత ఆఘాతంతోనే ప్రాణాలు కోల్పోయి ఉంటాడు. హోంవర్క్ అనే కాగితాల భారం కంటే, అది పూర్తిచేయకపోతే పడే దెబ్బల భయం..మిగతా పిల్లలతో అజ్ఞానపు పోలిక ఆ పసిగుండెను నిర్దిష్టంగా ఆపేసింది.
రక్తసిక్తమవుతున్న తరగతి గదులు
విశాఖ ఘటన ఒకే ఒక్కటి కాదు; దేశవ్యాప్తంగా దండనా సంస్కృతి పసిమొగ్గలను ఎలా చిదిమేస్తోందో గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. 2010లో కలకత్తా లా మార్టినియర్ స్కూల్లో హోంవర్క్ చేయలేదని ప్రిన్సిపాల్ బెత్తంతో కొట్టి అవమానించడంతో రౌవిత్ రంజన్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2017లో హైదరాబాద్ మల్కాజ్గిరిలో హోంవర్క్ చేయలేదని ఐదో తరగతి విద్యార్థినిని ఎండలో గంటల తరబడి మోకాళ్లపై నిలబెట్టడంతో వడదెబ్బకు గురై ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అలాగే 2022లో రాజస్థాన్లోని జలోర్లో నీటి కుండను తాకాడని టీచర్ కొట్టడంతో తొమ్మిదేళ్ల ఇంద్ర మేఘ్వాల్ మెదడులో రక్తస్రావమై మరణించగా, అదే ఏడాది యూపీలోని ఔరయ్యాలో స్పెల్లింగ్ తప్పు రాశాడని పదో తరగతి విద్యార్థి నిఖిల్ దోహ్రే ఉపాధ్యాయుడు దాడితో మృత్యువాత పడ్డం ఆటవిక దండనా సంస్కృతి పరాకాష్టను తేటతెల్లం చేస్తున్నాయి.
చట్టాలు విస్తృతం… క్షేత్రస్థాయిలో శూన్యం
విద్యాహక్కు చట్టం-2009 (సెక్షన్ 17), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల్లో పిల్లలను శారీరకంగా దండించడం, మానసికంగా వేధించడం చట్టరీత్యా నేరం. మొదటి తప్పునకు జరిమానా, పునరావృతమైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే వెసులుబాటు ఉన్నా క్షేత్రస్థాయి వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. దేశవ్యాప్త సర్వేల ప్రకారం 60 శాతానికి పైగా బడుల్లో విద్యార్థులు ఏదో ఒక రూపంలో వేధింపులకు గురవుతున్నారు. బాల్యంలో భౌతిక హింసను అనుభవించిన పిల్లల్లో 30 శాతానికి పైగా పెద్దయ్యాక తీవ్ర కుంగుబాటు, గుండె, నాడీ రుగ్మతల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఫిర్యాదుల పెట్టెలు, కౌన్సిలింగ్ కేంద్రాలు 80 శాతం పాఠశాలల్లో నామమాత్రంగా కూడా అమలు కావడం లేదు.
అనురాగమే బోధనకు పునాది కావాలి
ప్రైవేటు స్కూల్లో సీసీటీవీ ఉంది కాబట్టే ఈ దృశ్యాలు బయటపడ్డాయి. మరి కనీస నిఘా లేని మన ప్రభుత్వ బడుల సంగతేమిటి? అక్కడ ఎన్ని నిశ్శబ్ద రోదనలు అణగిపోతున్నాయి? చిన్నారి మృతి చెందాడు కాబట్టి ఇది సంచలనమైంది; కానీ రోజూ దండనలకు గురవుతూ బతికుండగానే జీవశ్చవాలు అవుతున్న చిన్నారుల మానసిక వేదన మాటేమిటి?
పాఠశాల అంటే కుతూహలాన్ని ఆవిష్కరించే వేదిక కావాలి తప్ప భయపెట్టే బందిఖానా కారాదు. ఆటల ద్వారా నేర్చుకునే విద్యావిధానం అమలు కావాలి. ఉపాధ్యాయ నియామకాల్లో సబ్జెక్టుతో పాటు బాలల మనస్తత్వ శాస్త్రం, కోప నియంత్రణలో శిక్షణ తప్పనిసరి చేయాలి. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయుల గుర్తింపును రద్దు చేయడంతో పాటు, పర్యవేక్షణ లోపించిన యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకునే బాధ్యతను తల్లిదండ్రులూ అలవర్చుకోవాలి. శిక్షలతో విధేయతను రాబట్టే పద్ధతిని విడనాడి, అనురాగంతో విద్యాబుద్ధులు నేర్పే సంస్కృతిని నిర్మించుకోవడమే ప్రణయ్ తేజ్ వంటి చిన్నారుల విషాద ఉదంతాలకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
The post బడిలో భయం వద్దు.. అనురాగమే ముద్దు! appeared first on 9Staar TV.
]]>