Warning: Constant WP_CACHE already defined in /home/teluskbp/public_html/9staartv.com/wp/wp-config.php on line 87

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/teluskbp/public_html/9staartv.com/wp/wp-config.php:87) in /home/teluskbp/public_html/9staartv.com/wp/wp-includes/feed-rss2.php on line 8
ఆంధ్ర ప్రదేశ్ Archives - 9Staar TV https://9staartv.com/wp/category/ap/ Telugu News & Videos Wed, 02 Sep 2026 03:07:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.1 https://9staartv.com/wp/wp-content/uploads/2026/06/cropped-9STAA-32x32.png ఆంధ్ర ప్రదేశ్ Archives - 9Staar TV https://9staartv.com/wp/category/ap/ 32 32 వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు… https://9staartv.com/wp/32430/ Wed, 02 Sep 2026 03:07:07 +0000 https://9staartv.com/wp/?p=32430 వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు ‘రస్ అల్ ఖైమా’కు మరో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం...

The post వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు… appeared first on 9Staar TV.

]]>

వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు

‘రస్ అల్ ఖైమా’కు మరో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
యూఏఈ కోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నాటి వాన్పిక్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు మరోసారి చుక్కెదురైంది.
ఈ వ్యవహారంలో రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా) పేరు మీద మరో రూ.200 కోట్లను అదనపు సెక్యూరిటీ డిపాజిట్లను జమచేయాలని ఆయనను, మరో నాలుగు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం
ఈ ఆదేశాలు జారీచేసింది. నిమ్మగడ్డ, ఇతరులు రాకియా సంస్థకు రూ.950కోట్లు చెల్లించాలని యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కోర్టు ఇచ్చిన తీర్పు అమలులో భాగంగా తాజా ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జమానాలో వాన్పిక్ ప్రాజెక్టు (వాడరేవు అండ్ నిజాంపట్నం పారిశ్రామిక కారి డార్) మొగ్గ తొడిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ నేతృత్వంలోని మ్యాటిక్స్ ఎక్స్పోర్ట్స్ 49శాతం, రాకియా 51శాతం వాటాతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇందుకోసం అప్పటి గుంటూరు, ప్రకాశం జిల్లాల తీరప్రాంతంలో దాదాపు 13,221 ఎకరాలు సేకరించారు. ప్రాజెక్టులో భాగంగా రూ.16,000 కోట్ల నుంచి రూ.17,000 కోట్ల పెట్టుబడులతో నౌకాశ్రయం, పెద్ద పారిశ్రామిక సముదాయం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ భూసేకరణ తీరుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత వాన్పిక్ ప్రాజెక్టు భూసేకరణ లొసుగులన్నీ బయట పడ్డాయి. వాన్పిక్ వ్యవహారంలో వైఎస్ కుమారుడు జగన్ అంటకాగిన నిమ్మగడ్డ ప్రసాద్కు కొన్నాళ్ల పాటు జైలు జీవితం తప్పలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే యూఏఈ కంపెనీ రాకియా ఈ ప్రాజెక్టు కోసం తాము పెట్టిన పెట్టుబడులను దుర్వినియోగం చేశారని
ఆ దేశంలోని కోర్టులను ఆశ్రయించి, రూ.950 కోట్లకు డిక్రీ తెచ్చుకుంది. ఈ ఆదేశాలను అమలు చేయాలని భారత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీం కోర్టు ఇంతకు ముందే రూ.212 కోట్లు డిపాజిట్ చేయాలని నిమ్మగడ్డ ప్రసాద్ను ఆదేశించింది. ఇప్పుడు దానికి మరో రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

The post వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డకు చుక్కెదురు… appeared first on 9Staar TV.

]]>
అక్కపై అమితమైన ప్రేమతో 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తమ్ముడి భావోద్వేగ ప్రయాణం… https://9staartv.com/wp/32375/ Wed, 19 Aug 2026 02:15:09 +0000 https://9staartv.com/wp/?p=32375 అక్కపై అమితమైన ప్రేమతో 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తమ్ముడి భావోద్వేగ ప్రయాణం తోబుట్టువుల బంధం అనేది రక్తసంబంధాలన్నింటిలోకెల్లా ఎంతో...

The post అక్కపై అమితమైన ప్రేమతో 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తమ్ముడి భావోద్వేగ ప్రయాణం… appeared first on 9Staar TV.

]]>

అక్కపై అమితమైన ప్రేమతో 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తమ్ముడి భావోద్వేగ ప్రయాణం
తోబుట్టువుల బంధం అనేది రక్తసంబంధాలన్నింటిలోకెల్లా ఎంతో స్వచ్ఛమైనది, అత్యంత పవిత్రమైనది.
అక్కా-తమ్ముళ్ల అనురాగానికి, వారి మధ్య ఉండే అనుబంధానికి హద్దులు, పరిమితులు ఉండవని ఈ నిజజీవిత సంఘటన మరోసారి రుజువు చేసింది.
పెళ్లి వేడుక ముగిసిన తర్వాత వధువును అత్తవారింటికి సాగనంపే ‘అప్పగింతల’ (వితాయి) ఘట్టం ఎవరి కళ్లలోనైనా నీళ్లు తెప్పిస్తుంది.👇👇

పుట్టింటిని, సొంత మనుషులను వదిలి వెళ్తున్నాననే బాధతో కన్నీరుమున్నీరయ్యే అక్కను చూసి ఆ తమ్ముడి మనసు తట్టుకోలేకపోయింది.

పెళ్లి కుమార్తెను తీసుకువెళ్లే అలంకరించిన కారులో బంధువుల రద్దీ కారణంగా ఆ చిన్న తమ్ముడికి కూర్చోవడానికి సీటు దొరకలేదు.

కారులో చోటు లేకపోయినా, తన అక్క ప్రయాణంలో తాను కూడా తోడుగా ఉండాలన్న ఆరాటం ఆ బాలుడిలో తీవ్రంగా పెల్లుబికింది.

అక్క వెళ్తున్న కారు వెనుకే తన పాత సైకిల్‌పై ప్రయాణం మొదలుపెట్టాలని ఏమాత్రం ఆలోచించకుండా తక్షణ నిర్ణయం తీసుకున్నాడు.

మండుటెండను, శారీరక అలసటను, కాళ్ల నొప్పులను ఏమాత్రం లెక్కచేయకుండా సైకిల్ పెడల్స్ తొక్కుతూ కారు వెంటే పరుగులు తీశాడు.

ఏకంగా 70 కిలోమీటర్ల మేర ఆగిపోకుండా, అలసిపోకుండా సైకిల్ తొక్కుతూ కారు వెంటే ప్రయాణించి అక్కపై తనకున్న అంతులేని ప్రేమను చాటుకున్నాడు.
దారిపొడవునా కారు అద్దాల్లోంచి తన తమ్ముడు శ్రమిస్తూ సైకిల్ తొక్కుతున్న దృశ్యాన్ని చూసి ఆ అక్క కన్నీటి పర్యంతమైంది.

డబ్బు, హోదా, విలాసాలు ఏవీ ఇవ్వలేని నిష్కల్మషమైన ఆత్మీయతను ఆ పసి హృదయం ఆవిష్కరించింది.
ఈ హృదయ విదారక, స్ఫూర్తిదాయక దృశ్యం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

ప్రపంచంలో ఎన్ని విలాసవంతమైన కార్లు ఉన్నా, ప్రేమతో తొక్కిన ఆ సైకిల్ ప్రయాణమే అత్యంత విలువైందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్వచ్ఛమైన ప్రేమకు రవాణా సౌకర్యాలు అడ్డంకి కావని, మనసుంటే మార్గం ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.
కాలం మారినా, ఆధునిక పోకడలు వచ్చినా తోబుట్టువుల మధ్య ఉండే అనురాగం ఎప్పటికీ వెలకట్టలేనిదని ఈ సంఘటన గుర్తుచేస్తుంది.

తోబుట్టువుల బంధం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనడానికి ఈ చిన్న తమ్ముడి ప్రయాణమే ఒక నిలువెత్తు నిదర్శనం.

జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన, భావోద్వేగ జ్ఞాపకంగా ఈ ప్రయాణం వారి జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.🙏🙏

The post అక్కపై అమితమైన ప్రేమతో 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన తమ్ముడి భావోద్వేగ ప్రయాణం… appeared first on 9Staar TV.

]]>
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రెండు రూట్లలో ఏరో ఎక్స్ ప్రెస్ బస్సులు… https://9staartv.com/wp/32363/ Mon, 17 Aug 2026 05:59:19 +0000 https://9staartv.com/wp/?p=32363 విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రెండు రూట్లలో ఏరో ఎక్స్ ప్రెస్ బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం ASR-1 మరియు...

The post విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రెండు రూట్లలో ఏరో ఎక్స్ ప్రెస్ బస్సులు… appeared first on 9Staar TV.

]]>

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రెండు రూట్లలో ఏరో ఎక్స్ ప్రెస్ బస్సులు

ప్రయాణికుల సౌకర్యార్థం ASR-1 మరియు ASR-2 పేర్లతో రెండు మార్గాల్లో రాకపోకలు

ASR-1 రూట్:
గాజువాక – NAD – గురుద్వార్ – జూ పార్క్ – మారికవలస – ఆనందపురం – తగరపువలస – ఏర్పాటుజంక్షన్ – అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.

ASR-2 రూట్:
గాజువాక – సింధియా – రైల్వే స్టేషన్ – బస్ స్టేషన్ – సిరిపురం – ఇస్కాన్ టెంపుల్ – IT హిల్స్ – మారికవలస – ఆనందపురం – తగరపువలస – ఏర్పాటుజంక్షన్ – అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.

ఈ రెండు మార్గాల్లో ప్రతి అరగంటకు అందుబాటులో ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసు బస్సులు ఉదయం 4:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు రాకపోకలు

ప్రయాణ ఛార్జీలు

ASR-1 రూట్:

– పాత గాజువాక నుంచి విమానాశ్రయం – ₹400
– NAD నుంచి విమానాశ్రయం – ₹350
– గురుద్వార్ నుంచి – ₹300
– జూ పార్క్ నుంచి – ₹250
– మారికవలస నుంచి – ₹200
– ఆనందపురం నుంచి – ₹150
– తగరపువలస నుంచి – ₹100
– ఎయిర్ పోర్ట్ జంక్షన్ నుంచి – ₹50

ASR-2 రూట్:

– పాత గాజువాక నుంచి విమానాశ్రయం – ₹400
– సింధియా నుంచి – ₹400
– కంచరపాలెం నుంచి – ₹400
– సిరిపురం నుంచి – ₹350
– ఇస్కాన్ టెంపుల్ నుంచి – ₹300
– IT హిల్స్ నుంచి – ₹250
– మారికవలస నుంచి – ₹200
– ఆనందపురం నుంచి – ₹150
– తగరపువలస నుంచి – ₹100
– ఎయిర్ పోర్టు జంక్షన్ నుంచి – ₹50

The post విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రెండు రూట్లలో ఏరో ఎక్స్ ప్రెస్ బస్సులు… appeared first on 9Staar TV.

]]>
ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల భద్రతకు పటిష్ట చర్యలు. https://9staartv.com/wp/32338/ Fri, 14 Aug 2026 02:36:59 +0000 https://9staartv.com/wp/?p=32338 తిరుపతి ఆగష్టు 13: తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో విద్యార్థుల భద్రత, భద్రతా...

The post ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల భద్రతకు పటిష్ట చర్యలు. appeared first on 9Staar TV.

]]>
తిరుపతి ఆగష్టు 13: తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో విద్యార్థుల భద్రత, భద్రతా ప్రమాణాలు మరియు నేరాల నివారణ చర్యలపై *తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు గురువారం ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, నేటి సమాజంలో ఎదురవుతున్న నూతన తరహా నేరాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ భద్రత తదితర అంశాలపై పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు ఎస్పీ గారు* దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా *ఎస్పీ గారు* మాట్లాడుతూ… “విద్యార్థుల భద్రత అనేది ఒక్క పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, పోలీసులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే మన పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించగలం” అని అన్నారు.

“నేటి విద్యార్థులను కేవలం మంచి మార్కులు సాధించేలా తయారు చేయడం మాత్రమే విద్యాసంస్థల లక్ష్యం కాకూడదు. మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యత, మానవతా దృక్పథం, సమాజం పట్ల బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దడమే అసలైన విద్య యొక్క లక్ష్యం” అని ఎస్పీ గారు పేర్కొన్నారు.

సోషల్ మీడియా వినియోగంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి,

ప్రస్తుతం సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు విద్యార్థుల జీవితాల్లో భాగమవుతున్నాయని, సాంకేతికత అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన సాధనాలు దుర్వినియోగం అయితే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎస్పీ గారు తెలిపారు.

తల్లిదండ్రులు తమ బిజీ జీవితాల్లో పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్న పరిస్థితుల్లో, పిల్లలు సోషల్ మీడియాలో చూసే కంటెంట్‌పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిఘా ఉంచాలని సూచించారు. పిల్లలకు సాంకేతికతను దూరం చేయడం పరిష్కారం కాదు.. దాన్ని బాధ్యతగా, సురక్షితంగా ఎలా ఉపయోగించాలో నేర్పించడమే అసలైన పరిష్కారం అని ఎస్పీ గారు స్పష్టం చేశారు.

సైబర్ మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా వేధింపులు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, ఐడెంటిటీ థెఫ్ట్ తదితర సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్ పరిచయాలు, వ్యక్తిగత ఫొటోలు మరియు వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలను చిన్న వయసు నుంచే పిల్లలకు వివరించాలని తెలిపారు.

మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన.

గంజాయి, మత్తు పదార్థాలు మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ గారు సూచించారు. NDPS చట్టం కింద మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలకు ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను విద్యార్థులకు తెలియజేయాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా వారిలో అవగాహన, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని తెలిపారు.

విద్యార్థుల రవాణాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి,

స్కూల్ బస్సులు, వ్యాన్లలో విద్యార్థుల రవాణా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని ఎస్పీ గారు స్పష్టం చేశారు. డ్రైవర్‌కు సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంతో పాటు, వాహన ఫిట్‌నెస్, ఇతర రవాణా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రతి స్కూల్ బస్సు లేదా వ్యాన్‌లో డ్రైవర్‌తో పాటు అటెండర్ తప్పనిసరిగా ఉండేలా చూడాలి.

విద్యార్థులు వాహనంలోకి ఎక్కే సమయంలో, దిగే సమయంలో అటెండర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, ముఖ్యంగా హైవేలు మరియు రద్దీ రహదారులపై ప్రయాణించే సమయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రతి విద్యాసంస్థలో CCTV కెమెరాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, విద్యార్థుల భద్రతలో భాగంగా ప్రతి పాఠశాల, కళాశాలలో CCTV కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని ఎస్పీ గారు సూచించారు. ప్రధాన ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలు, విద్యార్థుల రాకపోకలు జరిగే ముఖ్యమైన ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటు ఉండాలని తెలిపారు.

CCTV కెమెరాలు ఏర్పాటు చేసినంత మాత్రాన భద్రత పూర్తయినట్లు కాదని, కెమెరాల పనితీరు, రికార్డింగ్, స్టోరేజ్ మరియు అవసరమైన సమయంలో ఫుటేజ్ అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని తెలిపారు. అవసరమైన చోట పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని CCTV వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎస్పీ గారు అన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, వ్యక్తిగత భద్రత, అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులపై వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

పిల్లలు ఏదైనా సమస్యను చెప్పినప్పుడు వారిని భయపెట్టకుండా, నిందించకుండా, వారి మాటలను శ్రద్ధగా విని తగిన సహాయం అందించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత, విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, డ్రైవర్లు కూడా రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ గారు తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వకపోవడం వంటి అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.

తిరుపతి జిల్లాలో పోలీసు–విద్యాసంస్థల సమన్వయంతో మరింత సురక్షితమైన సమాజాన్ని, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర అత్యంత కీలకం. ఒక విద్యార్థిలో మంచి ఆలోచన, మంచి అలవాటు, మంచి విలువను చిన్న వయసులోనే నాటగలిగితే అది భవిష్యత్తులో ఒక మంచి కుటుంబాన్ని, మంచి సమాజాన్ని నిర్మిస్తుంది” అని ఎస్పీ గారు అన్నారు.

విద్యార్థులను *“మంచి పౌరులుగా తీర్చిదిద్దడం అనేది పోలీసులకే కాదు.. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజం మొత్తం కలిసి నిర్వహించాల్సిన బాధ్యత”* అని తెలిపారు.

తిరుపతి జిల్లా విద్యార్థులు విద్య, క్రీడలు, సాంకేతికతతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, మానవతా విలువల్లో కూడా ముందుండి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.

విద్యార్థుల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, మహిళా పోలీస్ విభాగం, సైబర్ క్రైమ్ పోలీసులు మరియు ఇతర పోలీసు విభాగాలు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రతి పాఠశాల, కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీస్ శాఖ మరియు ఈగల్ శాఖ సూచనలు అత్యవసర సంప్రదింపు వివరాలతో కూడిన అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేయాలని, పోలీసు శాఖతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని యాజమాన్యాలను కోరారు.

*“సురక్షితమైన విద్యాసంస్థలు.. సురక్షితమైన విద్యార్థులు.. బాధ్యతాయుతమైన పౌరులు.. సురక్షితమైన సమాజం” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.*

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ లు, శ్రీ శ్రీనివాసులు, (అడ్మినిస్ట్రేషన్), శ్రీ రవి మనోహరాచారి,(శాంతిభద్రతలు) మహిళా పోలీస్ విభాగం అధికారులు, సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

The post ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల భద్రతకు పటిష్ట చర్యలు. appeared first on 9Staar TV.

]]>
వేశ్య గృహంపై అలిపిరి పోలీసులు దాడి https://9staartv.com/wp/32335/ Fri, 14 Aug 2026 02:29:06 +0000 https://9staartv.com/wp/?p=32335 తిరుపతి,13, ఆగస్ట్,అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నమయ్య మార్గం, కొత్తపల్లి లోని ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం....

The post వేశ్య గృహంపై అలిపిరి పోలీసులు దాడి appeared first on 9Staar TV.

]]>
తిరుపతి,13, ఆగస్ట్,అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నమయ్య మార్గం, కొత్తపల్లి లోని ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం.

పోలీసుల దాడిలో 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

పట్టుబడ్డ విటురాలు ను హోమ్ కు తరలించే యత్నం.

ఆర్గనైజర్ సుశీలతోపాటు ముగ్గురిపై కేసు నమోదు రిమాండ్ కు తరలిస్తున్నట్లు అలిపిరి సీఐ రామకిషోర్ వెల్లడి.

The post వేశ్య గృహంపై అలిపిరి పోలీసులు దాడి appeared first on 9Staar TV.

]]>
కోళ్ల లారీ బోల్తా.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం! https://9staartv.com/wp/32299/ Tue, 11 Aug 2026 17:05:44 +0000 https://9staartv.com/wp/?p=32299 తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. భాకరాపేట నుంచి...

The post కోళ్ల లారీ బోల్తా.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం! appeared first on 9Staar TV.

]]>
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

భాకరాపేట నుంచి తిరుపతి వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బోల్తా పడటంతో అందులోని కోళ్లు రోడ్డుపై, పక్కనే ఉన్న ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిపోయాయి.

విషయం తెలుసుకున్న స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన కోళ్లను పట్టుకుని బస్తాల్లో నింపుకొని తీసుకెళ్లారు.

The post కోళ్ల లారీ బోల్తా.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం! appeared first on 9Staar TV.

]]>
తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ https://9staartv.com/wp/32272/ Sun, 09 Aug 2026 09:06:31 +0000 https://9staartv.com/wp/?p=32272 చిత్తూరు జిల్లా పీలేరులో అనుమానాస్పద మృతి కలకలం రేపింది.డిష్‌ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం (47) మృతదేహం తిరుపతి హైవేపై రక్తగాయాలతో...

The post తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ appeared first on 9Staar TV.

]]>
చిత్తూరు జిల్లా పీలేరులో అనుమానాస్పద మృతి కలకలం రేపింది.డిష్‌ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం (47) మృతదేహం తిరుపతి హైవేపై రక్తగాయాలతో కనిపించడంతో స్థానికులు రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే.. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు మలుపుతిరిగింది. కోడలు ఉమాదేవిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా.. హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాలు బలపడ్డాయి.

20 ఏళ్ల క్రితం వివాహం

పులిచెర్ల మండలం చింతలవారిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యానికి.. పుంగనూరు మండలం బోడెవారిపల్లికి చెందిన ఉమాదేవితో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కోసం ఈ దంపతులు పీలేరుకు వచ్చి స్థిరపడ్డారు. డిష్‌ కాలనీలో సొంతంగా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వీరికి లోహిత్ అనే కుమారుడు ఉన్నాడు.కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే వాటికి అసలు కారణం ఏమిటన్నది కుటుంబ సభ్యులకు పూర్తిగా తెలియలేదు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం మృతిచెందడం కుటుంబంలోనే కాకుండా స్థానికంగానూ కలకలం రేపింది.

హైవేపై మృతదేహం.. అనుమానాలు

తెల్లవారుజామున తిరుపతి హైవేపై సుబ్రహ్మణ్యం రక్తగాయాలతో మృతిచెంది కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత ఇది రోడ్డు ప్రమాదం అయి ఉండొచ్చని భావించారు. అయితే సుబ్రహ్మణ్యం తండ్రి కృష్ణయ్యకు అనుమానం కలిగింది. కుమారుడు, కోడలు, మనవడికి ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడంతో వెంటనే పీలేరుకు చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటం, ఉమాదేవి, లోహిత్ అక్కడ లేకపోవడంతో ఆయన అనుమానం మరింత బలపడింది. దీంతో కోడలు ఉమాదేవిపై అనుమానం వ్యక్తం చేస్తూ కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఆ కారణంగానే తన కుమారుడి హత్య జరిగి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఇంటి నుంచి హైవే వరకు ఆధారాల పరిశీలన

కృష్ణయ్య ఫిర్యాదు ఆధారంగా పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంతో పాటు సుబ్రహ్మణ్యం నివాసాన్ని పరిశీలించారు. ఇంటి వద్ద నుంచి హైవే వరకు రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.అదే సమయంలో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి కీలక ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. సుబ్రహ్మణ్యం మృతి హత్యగా భావించిన పోలీసులు.. భార్య ఉమాదేవి, కుమారుడు లోహిత్ ఆచూకీపై దృష్టి సారించారు. ఇద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.

వివాహేతర సంబంధమే కారణమా?

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఉమాదేవికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారని.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.ఉమాదేవి వివాహేతర సంబంధానికి సుబ్రహ్మణ్యం అడ్డుగా ఉండటంతోనే హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానంతో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం మృతదేహాన్ని హైవేపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

సహకరించింది ఎవరు?

సుబ్రహ్మణ్యాన్ని ఎలా హత్య చేశారు? ఈ ఘటనలో ఉమాదేవికి ఎవరైనా సహకరించారా? హత్య సమయంలో కుమారుడు లోహిత్ ఎక్కడ ఉన్నాడు? ఇంటి నుంచి మృతదేహాన్ని హైవేపైకి ఎలా తీసుకెళ్లారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఉమాదేవి నుంచి లభించే సమాచారం ఆధారంగా కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

పీలేరులో సంచలనం

సుబ్రహ్మణ్యం అందరితో కలివిడిగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఆయన అనుమానాస్పద రీతిలో మృతిచెందడంతో డిష్‌ కాలనీలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు దారితీసిన అసలు కారణాలు, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే విషయాలపై పోలీసుల విచారణ పూర్తయితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post తెల్లారేసరికి ఇంటి ముందు హైవేపై డెడ్ బాడీ appeared first on 9Staar TV.

]]>
చివరి మైలుకు అభివృద్ధి ఫలాలు.. ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగులు. https://9staartv.com/wp/32267/ Sun, 09 Aug 2026 08:52:14 +0000 https://9staartv.com/wp/?p=32267 **ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా**, మన ప్రాచీన సంప్రదాయాలకు, గొప్ప సంస్కృతికి, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ జ్ఞానానికి, ప్రకృతి మాతతో...

The post చివరి మైలుకు అభివృద్ధి ఫలాలు.. ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగులు. appeared first on 9Staar TV.

]]>

**ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా**, మన ప్రాచీన సంప్రదాయాలకు, గొప్ప సంస్కృతికి, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ జ్ఞానానికి, ప్రకృతి మాతతో విడదీయరాని అనుబంధానికి సంరక్షకులుగా నిలుస్తున్న మన గిరిజన సోదర, సోదరీమణులకు హృదయపూర్వక గౌరవం తెలియజేద్దాం. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు **అడవి తల్లి బాట, డోలీ రహిత ఆంధ్రప్రదేశ్** వంటి కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ, అభివృద్ధి చర్యల ద్వారా వారికి గౌరవం, అవకాశాలు, అవసరమైన మౌలిక సేవలు అందించేందుకు NDA ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆదిలాబాద్‌లోని తండాల నుంచి అరకు ప్రాంతంలోని PVTG గిరిజన సముదాయాల వరకు వారి జీవన విధానాన్ని గౌరవిస్తూ, వారి సమస్యలను స్వయంగా వింటూ, పాలన ద్వారా వారి అవసరాలను పరిష్కరించేందుకు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాను. 2018లో చేపట్టిన **పోరాట యాత్ర** సందర్భంగా మన్యం, అరకు ప్రాంతాల్లో పర్యటించి, గిరిజన సోదరులను కలుసుకుని, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం నాకు లభించింది. భగవంతుడి ఆశీస్సులతో నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం, ఈ ప్రాంతాలను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గిరిజన ప్రాంతాల్లో తొలిసారిగా విద్యుత్ సౌకర్యం కల్పించడం, రహదారులు మరియు మౌలిక వసతులను మెరుగుపరచడం, అంబులెన్స్‌లు మరియు అత్యవసర సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యల ద్వారా ప్రజల దైనందిన జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. గిరిజనుల అభివృద్ధి, మారుమూల ప్రాంతాలకు రహదారి మరియు కనెక్టివిటీని అందించేందుకు PM-JANMAN, PMGSY వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల ద్వారా నిరంతరం మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అభివృద్ధి ఫలాలు చివరి మైలు వరకు చేరేలా కృషి చేస్తూనే, మన గిరిజన సమాజం తమ గౌరవం, సంస్కృతి, అస్తిత్వం, జీవన విధానాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు సాగేలా చేయడమే మన లక్ష్యం. వారి ఇళ్లకు రహదారులు, వారి పిల్లలకు మెరుగైన అవకాశాలు, వారి భవిష్యత్తుకు గౌరవం కల్పిద్దాం. అయితే వారిని ప్రత్యేకంగా నిలబెట్టే మూలాలను, వారి సంస్కృతి మరియు సంప్రదాయాలను ఎప్పటికీ మరువకుండా, అభివృద్ధితో పాటు వారి అస్తిత్వాన్ని కాపాడే సమాజాన్ని నిర్మిద్దాం.

The post చివరి మైలుకు అభివృద్ధి ఫలాలు.. ఆదివాసీల జీవితాల్లో కొత్త వెలుగులు. appeared first on 9Staar TV.

]]>
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ https://9staartv.com/wp/32262/ Sun, 09 Aug 2026 04:17:45 +0000 https://9staartv.com/wp/?p=32262 తిరుపతి జిల్లా ప్రతినిధి ఆగస్టు 09, 2026: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు...

The post తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ appeared first on 9Staar TV.

]]>
తిరుపతి జిల్లా ప్రతినిధి ఆగస్టు 09, 2026: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల వరకు క్యూ లైన్లో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి సుమారుగా 20-24 గంటల సమయం పడుతోంది, రూ.300 టోకెన్ ఉన్న భక్తులకు 4-5 గంటల సమయం, దివ్య దర్శనం (పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు) సుమారుగా 6-7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,658 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 40,606 మంది భక్తులు.

The post తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ appeared first on 9Staar TV.

]]>
తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠా అరెస్ట్. https://9staartv.com/wp/32256/ Sat, 08 Aug 2026 18:02:57 +0000 https://9staartv.com/wp/?p=32256 తిరుమల, ఆగస్టు 08: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ,...

The post తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠా అరెస్ట్. appeared first on 9Staar TV.

]]>
తిరుమల, ఆగస్టు 08: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ, వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్., గార్ల ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీసు మరియు విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో ఆగస్టు 08న ఉదయం తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది.

అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అదేవిధంగా, తిరుమలలోని PAC-5 వద్ద భక్తులు ఛార్జింగ్‌కు ఉంచిన సెల్‌ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనకు సంబంధించి బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20) అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించిన సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో భాగంగా ఈ నెల 06న తెల్లవారుజామున తిరుమల PAC-5 వద్ద దొంగతనం చేసిన రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు మరియు అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు.

నకిలీ ఆధార్ కార్డులు లేదా ఇతర గుర్తింపు పత్రాల ద్వారా గదులు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. రూమ్ దళారీల కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు లేదా భక్తులను మోసం చేసే ప్రయత్నాలు గుర్తించిన వెంటనే పోలీసు అత్యవసర సేవ 112 లేదా సంబంధిత టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

భక్తుల భద్రత, సౌకర్యం మరియు తిరుమలలో పారదర్శకమైన సేవల పరిరక్షణకు పోలీసు మరియు టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

The post తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠా అరెస్ట్. appeared first on 9Staar TV.

]]>