ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేష్ కుమార్ మీనా…


ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మీనా, పూర్తి అదనపు బాధ్యతలతో గవర్నర్ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
ఈ నెల 24న గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ పదవీ ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా సీనియర్ ఐఏఎస్ మీనా ను గవర్నర్ కార్యదర్శి గా నియమిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం ఈమేరకు ఉత్తర్వులు జారీచేసారు.
గతంలో సిఎం క్యాంప్ అఫీస్ గా, తాత్కాలిక హైకోర్ట్ గా ఉండిన విజయవాడలోని కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ గా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. గవర్నర్ కార్యదర్శిగా నేడు బాధ్యతలు చేపట్టనున్న ముఖేష్ కుమార్ మినా, రాజ్ భవన్ పనులను పర్యవేక్షించనున్నారు

About The Author