‘రైతునేస్తం’ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం


‘రైతునేస్తం’ 15వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా అగ్రి జర్నలిస్టులతో పాటు విస్తరణ అధికారులను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, దివంగత డా.ఐవీ సుబ్బారావు పేరిట ఈ అవార్డులను అందజేయనున్నట్లు ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుదారులు తమ బయోడేటాతో పాటు పరిశోధన వ్యాసాలను, సాగు అనుభవాలను ఆగస్టు 10వ తేదీలోగా ‘ఎడిటర్‌, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-500004కు (లేదా) రైతునేస్తం, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌-522017 చిరునామాకు పంపాలని పేర్కొన్నారు.

పూర్తి వివరాలకు 96767 97777, 98493 12629 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు
చేసుకోవచ్చని తెలిపారు.

About The Author