ఏపి లో మెరుపు సమ్మెకుదిగిన 108 సిబ్బంది…


అర్ధ రాత్రి నుంచి వినపడని కుయ్ కుయ్ శబ్దాలు… ఏపి లో మెరుపు సమ్మెకుదిగిన 108 సిబ్బంది…

ఆపన్నులకు తక్షణ వైద్యసాయం అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా పురుడు పోసుకొన్న 108 ప్రాజెక్టు, పాలకుల నిర్లక్ష్యానికి బలై, మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతున్న పరిస్థితి… నెలల తరబడి జీతాల బకాయిలు, ఏపీలో ముఖ్యమంత్రులు మారినా మారని 108 కాంట్రాక్టు సిబ్బంది తలరాతలు, వెరసి గత అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్త మెరుపు సమ్మెకు దిగేలా చేసాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 450, 108 సర్వీసులు ఒక్కసారిగా ఆగిపోయేసరికి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

About The Author