ఏపీకి తరలిరానున్న మరో భారీ కంపెనీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో కంపెనీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమి ఏపీలో మరో కొత్త ప్లాంటు ఏర్పాటుకు సిద్ధంగా ఉంది. ప్లాంటు ఏర్పాటు అంశానికి సంబంధించి షావోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు.

మనుకుమార్ జైన్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జగన్ గారు చాలా సింపుల్‌గా, సాదాసీదాగా కనిపిస్తారు. కానీ అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన నుంచి మేం చాలా నేర్చుకున్నాం. మేకిన్‌ఇండియా ప్రణాళికల గురించి చర్చించాం. మా ఫోన్లు చాలావరకు ఏపీలోనే తయారవుతున్నాయి” అని ట్వీట్ చేశారు.

About The Author