ఏపీ గవర్నర్ ను కలిసిన బాబు నేతృత్వంలోని తెదేపా బృందం…


ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ను రాజ్‌భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం బృందం.

ఎమ్మెల్సీ లు యనమల రామకృష్ణుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, అశోక్ బాబు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప,నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావులను గవర్నర్ కు పరిచయం చేసారు చంద్రబాబునాయుడు.

తాము గవర్నర్ తో ఎటువంటి రాజకీయ అంశాలను చర్చించలేదని, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసామని పేర్కొన్నారు తెదేపా నేతలు.

#చంద్రబాబునాయుడు #ఏపిగవర్నర్ #బిశ్వభూషణ్‌హరిచందన్
#తెదేపా

About The Author