నా కొడుకును చంపేయండి…


నా కొడుకును చంపేయండి…
వాడు సమాజానికి చీడపురుగు… ఓ తల్లి వేదన ఇది…
హైదరాబాద్ లో నాలుగు రోజుల క్రితం ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్‌ కేసులో నిందితుడు రవిశంకర్‌ ను చంపేసినా బాధపడమని తల్లి చిట్టెమ్మ తెలిపింది. ‘ఓ అమ్మాయిని కిడ్నాప్‌ చేయడం తప్పు. తప్పు ఎవరు చేసినా అది తప్పే. నా కొడుకును కఠినంగా శిక్షించండి. అటువంటి నీచుడిని కన్నందుకు బాధగా ఉంది. అతడిని చంపేసినా బాధపడను. వాడెప్పుడో చనిపోయాడు. గతంలో నా కొడుకును మారమని చాలాసార్లు చెప్పాను. కాళ్లు పట్టుకుని బతిమిలాడాను. అయినా పద్ధతి మార్చుకోలేదు. నా కొడుకు తీరుతో మా కుటుంబం తీవ్ర అవమానాలు పడుతున్నాం. ఈ కేసులో అమాయకుడైన నా మనవడు రాజును (రవిశంకర్‌ కొడుకు) పోలీసులు తీసుకెళ్లారు. నా మనవడు నాకు కావాలి. వాడంటే నాకు ప్రాణం.’ అని ఆవేదన వ్య‍క్తం చేసింది.

రవిశంకర్‌ సోదరుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు చాలా దుర్మార్గుడు. వాడిని చంపేసినా మేం బాధపడం. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నా మేము పట్టించుకోం. ఒకవేళ అతడిని చంపేసినా శవాన్ని తీసుకు వెళ్లడానికి కూడా మేం రాము. అలాంటోడిని బతకనిస్తే సమాజానికే ప్రమాదం. ఏం పాపం తెలియని అతడిని కొడుకుని వేధింపులకు గురి చేయడం సరికాదు’ అని అన్నాడు.

About The Author