చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు


మొన్నటికి మొన్న వైసీపీ నేతలు చంద్రబాబు చేతికి త్వరలో బేడీలు పడనున్నాయి అని అనగా, ఆంధ్ర బీజేపీ నేత సునీల్ దేవధర్ కూడా వైసీపీని చంద్రబాబు తప్పులు నిరూపించి జైలుకు పంపాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణం రాజు తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు.
కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా ‘చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు’ అంటూ వ్యంగ్యాస్త్రాన్ని వదిలారు. కేంద్రం తెచ్చినా అభివృద్ధి పధకాలు అన్ని తనవి అని చెప్పుకొని ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసినందుకు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఎన్నికలు రెండు వారాలలో వస్తయనంగా ప్రజల సింపతీ కోసం చంద్రబాబు తనను కేంద్రం జైల్లో పెడుతుందేమో అని చంద్రబాబు ఉహించుకొని అన్నారు. ఇప్పుడు అదే నిజం అవ్వనుంది. ఇన్ని తప్పులు చేశాక చంద్రబాబు జైలుకు వెళ్ళాక తప్పదు అని ఆయన వ్యాఖ్యానించారు.

About The Author