మంత్రి నిరంజన్ రెడ్డి తల్లికి DK అరుణ నివాళులు…


రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తల్లి సింగి రెడ్డి తారకమ్మ గారు ఇటివల మృతి చెందారు. బుధవారం మాజీమంత్రి డికె అరుణ వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసానికి చేరుకుని తారకమ్మ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు స్థానిక బిజెపి నాయకులు డికె అరుణ వెంట ఉన్నారు.

About The Author