గుప్త నిధుల కేసులో ఏడుగురు అరెస్ట్ – వాల్మీకిపురం


పురాతన కట్టడాలను కూల్చివేసి ఇ గుప్తనిధుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న ముఠాను బుధవారం వాల్మీకిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శివ భాస్కరరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి వాల్మీకిపురం కలకడ మార్గమధ్యంలోని ఎగువ పల్లి వద్ద అ ఉన్న దొరస్వామి నాయుడు మామిడితోటలో బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు గుప్తనిధుల కోసం ఉన్నారని సమాచారం అందుకున్న వాల్మీకిపురం మోహన్ కుమార్, కలకడ ఎస్ ఐ రవి ప్రకాష్ రెడ్డి తమ సిబ్బందితో వెళ్లి గుప్తనిధుల ముఠా పై దాడి చేశారు. పోలీసులు వెళ్ళే సమయానికి ముఠా సభ్యులు క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు ప్రారంభించారు. అదే సమయంలో లో ఎస్ ఐ లు చాకచక్యంగా వారిని పట్టుకొని వాల్మీకి పురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుప్తనిధుల ముఠా సభ్యులు ములకలచెరువు మండలానికి చెందిన పూజారి మల్లికార్జున (32), జర్రి పార్టీ సురేష్ (28) బీ.కొత్తకోట మండలానికి చెందిన వెంకటేశ్వర్లు మదనపల్లికి చెందిన సుధాకర్ కలకడ మండలానికి చెందిన చిన్నప్ప మదనపల్లి మండలం పట్వారి పల్లెకు చెందిన కృష్ణమూర్తి తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లాకు చెందిన రామ స్వాములను అదుపులోకి తీసుకున్నారు బుధవారం అర

About The Author