రెండో ప్రేమ వివాహం చేసుకున్న సీనియర్ అధ్యాపకుడు…


విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సక్రమైన మార్గంలో నడిపించాల్సిన లెక్చరర్ తన స్టూడెంట్ కు మాయమాటలు చెప్పి ప్రేమపెళ్లి చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా కదిరి లో చోటుచేసుకుంది.
కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ కు 2015 లోనే త్రివేణి అనే అమ్మాయితో ప్రేమ పెళ్ళి జరిగింది. అంతకంటే ముందు ప్రవీణ్ కుమార్ త్రివేణి అక్కను పెళ్లిచూపులు చూశాడు. అయితే త్రివేణి అక్క ప్రవీణ్ కంటే ఆరు నెలలు పెద్దది కావడంతో ఆ సంబంధం వద్దనుకున్నారు. త్రివేణి అప్పుడు బీటెక్ చదువుతుంది . నేవంటే నాకు ఇష్టం… నిన్ను లవ్ చేస్తున్నాను అంటూ త్రివేణి వెంటపడి నీవు కాదంటే నేను చచ్చిపోతాను అంటూ మరి త్రివేణి పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం ఆరునెలలు సాఫీగానే సాగింది. ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు కట్నం తీసుకురావాలని త్రివేణి పై ఒత్తిడి చేశారు. కట్నం ఇచ్చే వరకు నీవు మాకు అక్కర్లేదు అంటూ త్రివేణి ని పుట్టింటికి పంపించేశారు. పలుమార్లు తమ కూతుర్ని కాపురానికి తీసుకెళ్లాలని కోరినప్పటికీ అతను ససేమిరా అన్నాడు. 14 నెలల క్రితం కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవీణ్ కుమార్ ఇంగ్లీష్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. అదే కాలేజీలో బీ కాం చదువుతున్న అమ్మజాన్ అనే విద్యార్థిని ప్రేమించి ఈ నెల 15 న రెండో పెళ్ళి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న విషయం మొదటి భార్య త్రివేణి కి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . తనకు న్యాయం చేసి తన భర్తను తనకు అప్పజెప్పాలని త్రివేణి పోలీసులను కోరుతోంది. ఇదిలా ఉంటే త్రివేణి కూడా తమతో ఉండేందుకు తన రెండో భార్య అమ్మా జాన్ అంగీకరించిందని తామంతా కలిసే ఉంటామని ఇలా కుదరకపోతే తాను అమ్మజాన్ ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటామని పోలీసులకు ప్రవీణ్ కుమార్ ఒక లేఖ పంపాడు. ఆగస్టు 14 నుండి ప్రవీణ్ కుమార్ ఆర్ కాలేజీ కి రావడం లేదని కనీసం అందుకు సంబంధించిన సమాచారం కూడా తమకు ఇవ్వలేదని కాలేజీ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ స్మిత తెలిపారు. అతని కోసం పోలీసులు కూడా కాలేజీ కి వచ్చారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. పరారీలో ఉన్న అంబేద్కర్ ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

About The Author