రాజీవ్ గాంధీ ఎప్పుడూ అలా చేయలేదు: సోనియా గాంధీ…


1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ కూడా పూర్తి మెజారిటీతో గెలిచారని, కానీ ఆయనెప్పుడూ తన అధికారాన్ని భయపెట్టేందుకు, ప్రజల స్వేచ్ఛను హరించేందుకు ఉపయోగించలేదనీ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియాగాంధీ పరోక్షంగా నిప్పులు చెరిగారు.
రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘1984లో రాజీవ్‌గాంధీ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కానీ ఆయనెప్పుడూ తన అధికారాన్ని భయపెట్టేందుకు, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించేందుకు ఉపయోగించలేదు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే చర్యలు ఎప్పుడూ చేపట్టలేదు’’ అని సోనియా పేర్కొన్నారు. ఇప్పడా విలువలను నాశనం చేయాలని చూస్తున్న వారిని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఉందన్నారు. భారతదేశ ఆలోచనను మార్చాలనుకునే వారికి, విభజన శక్తులకు పార్టీ ఎదురొడ్డి పోరాడుతుందని సోనియా స్పష్టం చేశారు………

About The Author