ప్రభాస్‌ ‘సాహో’ మూవీకి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’.సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫస్ట్ వీక్ ఎక్కువ రేటుతో టికెట్ అమ్ముకోవడంతో పాటు స్పెషల్ బెనిఫిట్ షోల కోసం  ‘సాహో’ చిత్ర నిర్మాతలు స్పెషల్ పర్మిషన్ కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ‘సాహో’ చిత్ర నిర్మాతల రిక్వెస్ట్‌ను సున్నితంగా తిరస్కరించింది. ‘బాహుబలి 2’ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సినిమాకు కూడా బెనిఫిట్ షోస్‌తో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు.తాజాగా ‘సాహో’ సినిమాకు కూడా టికెట్ రేటు పెంచుకోవడంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ  నిర్ణయంపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

About The Author