ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే…


ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మాజీ విప్‌ కూన రవికుమార్‌ హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా నాటకాలు చేస్తే అధికారులను చెట్టుకు కట్టి కాల్చేస్తామని ఎంపీడీఓ దామోదరరావుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలు చెప్పిన పనులు చేయకపోతే ఇబ్బందులు తప్పవని మండల ప్రత్యేకాధికారి నంబాళ్ల దామోదరరావు సమక్షంలో మండల పరిషత్‌ ఉద్యోగులను హెచ్చరించారు. మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల సమావేశం అనంతరం మండల పరిషత్, తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందిపై ఆయన సోమవారం శివాలెత్తారు. ముందుగా మండలపరిషత్‌ కార్యాలయంలోకి పార్టీ కార్యకర్తలతోపాటు ప్రవేశించారు. మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీకు కేటాయించిన చాంబర్‌లోకి కార్యకర్తలతో సహా తలుపులు తోసుకొని ప్రవేశించారు.

About The Author