ఏపి స్పీకర్ తమ్మినేని పై కూన ఫైర్….


ఆముదాల వలస తెలుగు దేశం కార్యాలయం లో కూన రవికుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు

సరుబుజ్జిలి మండలం లో MPDO కార్యాలయం లో టీడీపీ మాజీ MLA కూన మరియు కార్యకర్తలు హల్చల్ చేసారని తప్పుడు కేసులు నమోదు చేసారని ఆగ్రహం వ్యక్తంచేసారు. ప్రజా సమస్యలు అడగటానికి MPDO కార్యాలయం కు వెళితే అధికారంలో ఉన్నామని తప్పుడు కేసులు పెట్టడం సరికాదు అన్నారు.

కార్యాలయం సమావేశ మందిరం లో సిబ్బంది భోజనాలు చేస్తున్నారని MPDO గది కి తాళాలు వేసి ఉన్నాయని, ప్రత్యేక అధికారి రూమ్ కి వెళితే అతని సీట్ లో మాజీ ZPTC భర్త సురవరపు నాగేశ్వరరావు కూర్చొని ఉన్నారని, అలా కుర్చీలో కూర్చునే అధికారం ఎవరు ఇచ్చారు వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు అని ప్రశ్నించారు.

నేను రిజర్వేషన్ల లిస్టు అడగటానికి వెళిత ఆఫీసులో లేదని, జిల్లా కలెక్టర్ ను నేను ప్రశ్నింస్తున్నాను అధికారులు, అధికార పార్టీకి తొత్తులు గా పని చేస్తున్నారని, అధికారులు తప్పులు చేస్తే సహించేది లేదని అన్నారు. నేను మధగయహ్నం 1గ నుంచి 3 వరకు కార్యాలయం లో ఉంటే రాత్రి 10 గం,, కేసు పెట్టడం సరికాదు ఆన్నారు.ఈ కార్యక్రమంలో బోర గోవింద రావు,కూన అమ్మినాయుడు, నందివడా గోవింద రావు ,అనెపు రామకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author