తల్లీ … నీ ప్రేమ అజరామరం… చావులోనూ బిడ్డను కాపాడుకుంది….


బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని నాడంగ గ్రామంలో ఆదివారం రాత్రి పాత మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను ఇమామ్‌బీ (40), ఆమె కూతురు హసీనా(25), మనవడు ఇమ్రాన్‌(3)గా గుర్తించారు. వివరాలు… హసీనాకు రాయచూరు జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన బాషాతో వివాహమైంది. నెల క్రితం రెండవ కాన్పు కోసం హసీనా కొడుకు ఇమ్రాన్‌ను తీసుకుని నాడంగలోని పుట్టింటికి వచ్చింది. నెలకిందట మగపిల్లాడు జన్మించాడు. రాత్రి భోజనం చేసి నిద్రిస్తుండగా ఇటీవల వర్షాలకు నానిన ఇంటి మిద్దె కూలి మీద పడింది. తల్లి హసీనా శిశువుకు అపాయం లేకుండా ఒడిలో దాచుకుని తాను శిథిలాల కింద ప్రాణాలను విడిచింది. భారీ శబ్ధం రావడంతో అనుమానంతో గ్రామస్తులు స్థలానికి చేరుకొని కూలిన మట్టిని, కర్రలను తొలగించి చూడగా శిశువు మాత్రం కొన ఊపిరితో బతికి ఉండగా, ముగ్గురు అక్కడికక్కడే విగతజీవులై ఉన్నారు. వెంటనే బిడ్డను ఆస్పత్రికి తరలించారు. తన ప్రాణం పోతున్నా బిడ్డను కాపాడుకున్న తల్లి త్యాగాన్ని చూసి గ్రామస్తులు సైతం కన్నీరుకార్చారు.

About The Author