పోలవరం చీఫ్‌ఇంజినీర్‌ను తొలగించిన ప్రభుత్వం…


అమరావతి : పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న ఆయన.. పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్యుడిగానూ ఆయన్ను తొలగించారు. వెంకటేశ్వర రావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా సీఈ సుధాకర్‌బాబును ప్రభుత్వం నియమించింది.

About The Author