వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేసం….


రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు:-
నవయుగకు పోలవరం హైడల్‌ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
రూ. 3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోదం.
రివర్స్‌ టెండరింగ్‌పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ ఆమోదం
కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్‌ ఆమోదం
మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు, మంత్రివర్గం ఆమోదం
ఆశావర్కర్ల వేతనం పెంపునకు కేబినెట్‌ ఆమోదం
రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం
2018 ఆగస్టు నుంచి రూ. 1500 ఉన్న ఆశావర్కర్ల జీతం రూ.3వేలకు పెంపు, మరో రూ.3వేల రూపాయలు ప్రతిభ ఆధారంగా నిర్దేశించిన అప్పటి ప్రభుత్వం.
ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి, ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్న మంత్రివర్గం
భూముల లీజు కూడా చెల్లించలేదని కేబినెట్‌కు తెలిపిన పరిశ్రమల శాఖ.

About The Author