అక్కున చేర్చుకొని ఓదార్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ

బెంగళూరు : చంద్రయాన్ -2 ప్రయోగం చివరి దశలో ఏర్పడిన లోపంతో ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ ను హత్తుకొని ఓదార్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోవడంతో శివన్ తో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. నిరాశపడిన ఇస్రో ఛైర్మన్ శివన్‌తోపాటు శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఓదార్చి ధైర్యం చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ భుజం, వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. ఈ దృశ్యాన్ని టీవీలు లైవ్ ఇవ్వడం దేశ ప్రజలందరినీ ఆకర్షించింది.

About The Author