‘చెంబురాజా’ బిరుదు.. ఎవరికో తెలుసా?

మంచిర్యాల: బహిరంగ మలవిసర్జనను అరికట్టేందుకు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టులో వినూత్న ఆలోచన చేశారు. బహిరంగ మలవిసర్జన చేసిన వారికి ‘చెంబురాజా’ బిరుదు ఇవ్వాలని ఆ గ్రామ పెద్దలు నిర్ణయించారు. దీంతోపాటు రూ. 500 జరిమానా విధించనున్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామాధికారులు ఈ కొత్త విధానాన్ని అమలు చేశారు. శౌచాలయం నిర్మించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

About The Author