టిటిడి తరఫున ఈఓ. శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ.     కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం టిటిడి తరఫున ఈఓ. శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు.    ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈఓ దంపతులకు కాణిపాకం ఆలయ ఈఓ శ్రీ దేముళ్లు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.   కాణిపాకంలో సెప్టెంబరు 2న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం జరుగనుంది. ఈ కల్యాణం కోసం టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

About The Author