మామండూరు వద్ద 10 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం ఇద్దరు స్థానిక స్మగ్లర్లు అరెస్టు

తిరుపతి అటవీ ప్రాంతం లోని మామండూరు వద్ద ఎర్ర చందనం దుంగలను రవాణా చేస్తున్న స్మగ్లర్లపై దాడి చేసి పది దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దీనికి సహహరించిన ఇద్దరు స్థానిక స్మగ్లర్లు ను అరెస్టు చేశారు.‌టాస్క్ ఫోర్స్ డీఅర్ ఒ పివి నరసింహారావు టీమ్   , టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్, డీఎస్పి అల్లా బక్ష్ సూచన మేరకు తిరుపతి అటవీ పరిధిలోని మామండూరు కూంబింగ్ చేస్తుండగా దర్గా పాయింట్ వద్ద స్మగ్లర్లు తారస పడ్డారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించు కున్నారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని పట్టుకో గలిగారు. వారిని రేణిగుంట దొడ్లమిట్ట ప్రాంతానికి చెందిన వి. రఘు అలియాస్ మోహన్ (28), కుక్కలదొడ్డికి చెందిన శివ (28) గా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్, ఎఫ్ ఆర్ ఒ లక్ష్మీ పతి, ఇతర అధికారులు అభినందించారు.

About The Author