తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు శుక్రవారం,   ఉదయం 5 గంటల  సమయానికి,తిరుమలలో భక్తుల రద్దీసాదారణం,స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 26 గదులలో భక్తులు   చేచియున్నారు,ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు  10.గంటలు పట్టవచ్చును

నిన్న స్వామివారికి  హుండీలో భక్తులుసమర్పించిన నగదు   ₹: 3.54 కోట్లు,   నిన్న 27,128 మంది   భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి   మొక్కులు తీర్చుకున్నారు,

నిన్న  69,727 మంది  భక్తుల కు కలియుగ దైవం   శ్రీ వేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది,  శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం   పట్టవచ్చును,

వయోవృద్దులు మరియు దివ్యాంగుల

ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750)  మ: 2 గంటలకి (750) ఇస్తారు,

 చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_ సుపథం మార్గం గుండా శ్రీవారి  దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది ,కావున లెమ్ము స్వామి

 

About The Author