తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈరోజు ఆదివారం , ఉదయం 5 గంటల  సమయానికి ,తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ….శ్రీవారి దర్శనానికి  అన్ని కంపార్ట్ మెంట్లలు నిండి బయట క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు…శ్రీవారి  సర్వ దర్శనానికి  12 గంటల సమయం పడుతోంది…..ప్రత్యేక ప్రవేశ  300/- దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది…. నిన్న  సెప్టెంబర్  14 న 87,623 భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.48 కొట్లు.వయోవృద్దులు మరియు దివ్యాంగులప్రత్యేయకంగా ఏర్పాటు

  చేసిన కౌంటర్ ద్వారా

  ఉ:10 గంటలకి (750)

  మ: 2 గంటలకి (750)  ఇస్తారు,చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_  సుపథం మార్గం గుండా శ్రీవారి  దర్శనానికి అనుమతిస్తారుఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_

కావున లెమ్ము స్వామి

 

About The Author