కచ్చులూరులో గోదావరి నదిలో గల్లంతైన బోటు ఆచూకీ గుర్తింపు

రాజమండ్రి: కచ్చులూరులో గోదావరి నదిలో గల్లంతైన బోటు ఆచూకీ దొరికింది. మంగళవారం బోటు నుంచి మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉంది. బోటు బయటకు తీస్తేగానీ అందులో ఎంతమంది చిక్కుకుపోయారనేది తెలియనుంది. కాగా, రెండో రోజూ మృతదేహాలు లభ్యమవలేదు. గల్లంతైన వారికోసం గోదావరిలో ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 మృతదేహాలు వెలికితీశారు. మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. ఇంకా 39 మంది ప్రయాణికుల ఆచూకీ లభ్యం కావాల్సిఉంది.

About The Author