ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుగారి అంతిమయాత్ర…


నరసరావుపేటలో తెదేపా సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుగారి అంతిమయాత్ర దృశ్యాలివి. కోట సెంటర్ లోని కోడెల స్వగృహం వద్ద ప్రారంభమై సత్తెనపల్లిరోడ్డు, వినాయకటెంపుల్‌, బరంపేట, టూటౌన్‌ పీఎస్‌, పల్నాడు రోడ్డు, మల్లం సెంటర్‌, ఐలాబజార్‌ మీదుగా ఊరేగింపు కొనసాగింది.
ఈ అంతిమ యాత్రలో తెదేపా అధ్యక్షులు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లతో పాటు టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నరసరావుపేట ప్రాంతంలో 144 సెక్షన్ పెట్టడం పై చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కారణంగా పాలకులు కాస్త వెనక్కి తగ్గారు.
నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలులో ఉన్న 144వ సెక్షన్‌కు కోడెల అంత్యక్రియలకు ఎటువంటి సంబంధం లేదని ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. దీంతో తమ ప్రియతమ నాయకుడిని కడసారి చూసేందుకు ప్రజలు దారిపొడుగునా బారులు తీరి తుది వీడ్కోలు పలికారు.

About The Author