పోలవరం ప్రాజెక్టు లోని ప్రధాన డ్యామ్‌, జలవిద్యుత్‌ కేంద్రాల రివర్స్‌ టెండరింగ్‌లో, మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ 12.6శాతం తక్కువ కోట్ చేసి కాంట్రాక్ట్ దక్కించుకుంది.
ఈ పనులకు రూ.4,987 కోట్లను ఇనిషియల్‌ బెంచ్‌ మార్క్‌ విలువగా ప్రభుత్వం నిర్ణయించగా.. మేఘా సంస్థ రూ.4,358 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌ 1గా నిలిచింది. అంచనా విలువకంటే 12.6శాతం తక్కువగా మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ కోట్‌ చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
జలవనరులశాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్‌ను దాఖలు చేసింది. ప్రీబిడ్‌ సమావేశానికి దాదాపు 8 సంస్థలు హాజరై సందేహాలు నివృత్తి చేసుకున్నా గడువు ముగిసేనాటికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్‌ వేసింది.

About The Author