ఎమ్మారై లోకి పంపి రోగిని మరిచిపోయారు…


హరియాణాలోని పంచకుల ఆస్పత్రిలో షాకింగ్‌ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ రోగిని ఎంఆర్‌ఐ స్కానింగ్‌ కోసం యంత్రంలోకి పంపిన వైద్యులు, సాంకేతిక సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ విషయాన్నే మరిచిపోయారు! దీంతో అతడు బెల్ట్‌ను విరగ్గొట్టుకొని మధ్యలోనే బయటకు వచ్చేసిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. 59 ఏళ్ల రామహర్‌ లోహర్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనం నడుపుతున్న సమయంలో భుజం భాగంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో అతడు పంచకుల సివిల్‌ ఆస్పత్రికి వెళ్లగా.. ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అక్కడి సాంకేతిక సిబ్బంది.. 10 నుంచి 15 నిమిషాల వరకు యంత్రంలో ఉండాలని సూచించారు. 30 నిమిషాలు గడిచినా ఎవరూ అతడిని బయటకు తీయలేదు. దీంతో ఊపిరాడకపోవడం.. యంత్రంలో వేడి పెరిగిపోవడంతో ఆ యంత్రం బెల్ట్‌ను విరగ్గొట్టుకొని బయటపడ్డాడు

About The Author