సీబీఐ అధికారులమని నమ్మించి 25 తులాల బంగారంతో పరారీ

హైదరాబాద్: సీబీఐ అధికారులమని చెప్పి కొందరు వ్యక్తులు ఓ జ్యోతిష్యుడిని నమ్మించి 25 తులాల బంగారు ఆభరణాలతో పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ అమీర్‌పేట అన్నపూర్ణ బ్లాక్‌లో నకిలీ సీబీఐ అధికారులు హల్‌చల్‌ చేశారు. సీబీఐ అధికారులమని చెప్పి ఓ జోతిష్యుడి ఆఫీసులో సోదాలు నిర్వహించారు.జోతిష్యుడు జగదీశ్‌ నుంచి 25 తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు.

About The Author