అమితాబ్ ను వరించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు…


ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను కేంద్రం ప్రకటించింది… కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు…

77 ఏళ్ళ వయసులోనూ వెండితెర, బుల్లితెరపై తనదైన ముద్రతో ప్రేక్షకులను కట్టిపడేసే… అమితాబ్‌కు ఈ అవార్డును ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది… గత ఏడాది ఆయన సహచర నటుడు వినోద్‌ ఖన్నాకు ఈ అవార్డు లభించింది. 1969లో మృణాసేన్‌ కళాఖండం భువన్‌ షోమ్‌ చిత్రానికి గొంతు ఇచ్చిన అమితాబ్‌ అదే ఏడాది సాత్‌ హిందుస్థానీ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 226 చిత్రాల్లో నటించగా ఇంకా పలు చిత్రాలు నిర్మాణదశలో ఉన్నాయి.

About The Author