వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత

 

హైదరాబాద్ :ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబసభ్యులు ఇటీవల సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో వేణుమాధవ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని వేణు మాధవ్ ప్రతినిధులు తెలిపారు. సినీ నటులు జీవిత-రాజశేఖర్ లు ఆస్పత్రికి వచ్చి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

About The Author