పద్మావతి నిలయం ప్రారంభోత్సవం లో టిటిడి ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి      

తిరుపతి : తిరుచానూరులోని  పద్మావతి నిల‌యాన్ని టిటిడి ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి  బుధవారం ఉదయం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భక్తుల సౌకర్యార్థం తిరుచానూరులో నూతనంగా నిర్మించామన్నారు. టిటిడి 4.26 లక్షల చదరపు అడుగులలో దాదాపు రూ.74.70 కోట్లతో టిటిడి నిర్మించింద‌న్నారు. ఇందులో 200 వసతి గదులలో 120 నాన్ ఏసీ గదులు, 80 ఏసీ గదులు ఉన్నాయ‌ని తెలిపారు. 4 నాన్ ఏసీ డార్మిటరీలు, 1 ఏసీ డార్మిటరీని, రిసెప్ష‌న్‌, ఈ-దర్శన్ కౌంటర్లు, ఏటీఎం, క్లాక్ రూమ్స్, రెస్టారెంట్  ఏర్పాటు చేశామ‌న్నారు. రోజుకు దాదాపు 1600 మందికి వసతి సౌకర్యం కల్పించేలా ఈ భవనాన్ని నిర్మించిన‌ట్లు వివ‌రించారు.

యాత్రికులు, భక్తుల సౌకర్యాల కలపనకే టిటిడి పెద్దపీట వేస్తున్నట్లు పాలక మండలి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.భ‌క్తులు ఈ స‌దుపాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

 

About The Author