గవర్నర్ నుండి బంగారు పతకాన్ని అందుకున్న అనంతపురం కలెక్టర్…


ఇండియన్ రెడ్ క్రాస్ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర వహంచిన అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ రాష్ట్ర గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ నుంచి బంగారు పతకాన్ని అందుకున్నారు. విజయవాడ ఎస్.ఎస్.కన్వ్ న్షన్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు గవర్నర్ చేతులమీద అవార్డు అందుకున్నారు. కర్నూలు కలెక్టర్ గానున్న తరుణంలో రెడ్ క్రాస్ సొసైటీకి అందించిన విశేష సేవలకుగాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెన్ జర్నలిస్ట్స్ రాష్ట్ర సంఘం ఆయనకు ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేసిన వారిలో సీనియర్ ఐ ఆర్ టి ఎస్ ఉన్నతాధికారి రవిప్రసాద్ పాడి, బండ్రెడ్డి కిషోర్ కుమార్, ప్రొఫెసర్ బాల నాగేశ్వరరావు, టి.కృష్ణప్రసాద్, కళారత్న డాక్టర్ బాబావలిరావు, మేకా రవీంద్రబాబు, విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారి కె.కోటేశ్వరరావు, జర్నలిస్ట్స్ సంఘనాయకులు బడే ప్రభాకర్, వడ్డి ఓంప్రకాష్, నారాయణ తదితరులున్నారు.

About The Author