చిత్తూరు యాదమరి ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ

చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రాబ్యాంక్‌లో సోమవారం భారీ చోరీ ఘటన జరిగింది. అమరరాజా పరిశ్రమ ఆవరణలోని బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు నగలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. సుమారు 17 కిలోల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు. నగలు విలువ సుమారు రూ.3.47 కోట్లు ఉంటుందని తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని లాకర్లను పరిశీలించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

About The Author