తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు మంగళవారం,15.10.2019   ఉదయం 6 గంటల సమయానికి,నిన్న 92,736 మంది  భక్తుల కు కలియుగ దైవంశ్రీ వేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లో 26గదుల్లో భక్తులు వేచిఉన్నారు,ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనానికిసుమారు20గంటలు  పట్టవచ్చును,

నిన్న 30,736 మంది   భక్తులు స్వామి వారికి    తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

నిన్న స్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు ₹: 2.81కోట్లు,శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం  పట్టవచ్చును,

గమనిక:

అక్టోబ‌రు 15, 29నవృద్ధులు, దివ్యాంగులకుప్రత్యేక ఉచిత దర్శనం,అక్టోబ‌రు 16, 30 తేదీల్లోచంటిపిల్లల తల్లిదండ్రులకుశ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,

భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగంచేసుకోగలరు,

వయోవృద్దులు / దివ్యాంగుల

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకిచేరుకోవాలి,ఉ:10కిమరియుమ:2గంటలకిదర్శనానికిఅనుమతిస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండా  శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11నుండి సా: 5 గంటల వరకు దర్శనానికిఅనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదికావున లెమ్ము స్వామి

 

About The Author