గల్లంతైన వారి కోసం సాగర్ కాలువను జల్లెడ పడుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

సూర్యాపేట: నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ వాహనంతో పాటు అందులో ఉన్న స్నేహితుల బృందం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సాగర్ కాలువను జల్లెడ పడుతున్నాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

విమలకొండ మహేశ్‌ వివాహానికి ఆయన స్నేహితులు, హైదరాబాద్‌ ఈసీఎల్‌లోని అంకూర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 11 మంది రెండు కార్లలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఒక కారు కా లువలోకి దూసుకెళ్లింది. ఆ కారులోని అబ్దుల్‌(45), రాజేశ్‌(29), సంతోష్‌(23), జాన్సన్‌(33), నరేశ్‌(35), పవన్‌(23) గల్లంతయ్యారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో 18అడుగుల లోతు ఉండటం, నీటి ఉధృతి ఎక్కువ గా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

About The Author