ఈ ఎద్దు పేడ కోసం ఎదురుచూపు…


జనక్ రాజ్ అనే వ్యాపారి కుటుంబం ఓ ఎద్దు పేడ కోసం మూడు రోజులుగా పడిగాపులు కాస్తోంది. అది పేడ వేసిన ప్రతీసారి పేడ ను ఆత్రంగా పరిశీలిస్తోంది. పేడ ఎక్కువగా వేయాలని మేత బాగా పెడుతున్నారు.. ఇంతకీ ఎందుకో తెలుసా..? ఈ ఎద్దు తమ ఇంట్లో బంగారం తినేసిందని వాళ్ళ అనుమానం. ఇంట్లో పనికి రాని కూరగాయలు ఒక పాత్రలో పెట్టి ఇంటిముందు చెత్త కుండీలో వేశారట.. ఆ కుండీలో చెత్తను ఈ ఎద్దు తినేసిందని వాళ్లు సీసీ కెమెరా సాయంతో పట్టేశారు. అప్పటినుంచి ఎద్దును తమ ఇంట్లో కట్టేసి అల్లుడిని మేపినట్టు మేపుతున్నారు. బాగా తిని ఎక్కువ పేడ వేస్తే బంగారం పేడ ద్వారా బయటకు వస్తుందని వాళ్ళ ఆశ.. అయితే విషయం తెలుసుకున్న పశువుల డాక్టర్ ఒకరు ఎద్దుకు ఎక్స్ రే తీయించమని చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు..

About The Author