నటుడు శశికుమార్ ఆత్మహత్య

తమిళనాడులో కోలీవుడ్ బుల్లితెర నటుడు శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. జోలార్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బుల్లితెర ఫేమస్ నటిమణి రాఘవి భర్త శశికుమార్. చిన్న చిన్న సీరియల్స్‌లో నటిస్తూ కెమెరామెన్‌గా శశి పని చేస్తున్నాడు. అతడు తన భార్యకు బెంగళూరు వెళ్తూనని చెప్పి వెలూరులో సమీపంలో అంబూర్‌లో దిగాడు. అనంతరం జోలార్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని జోలార్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శశికి ఆర్థిక ఇబ్బందులున్నట్టు పోలీసులు వెల్లడించారు.

సీరియల్ షూటింగ్ సెట్స్ నుంచి శశి కుమార్ కెమెరా దొంగతనం చేసినట్టుగా వాట్సాప్ గ్రూప్‌లలో వార్తను సహోద్యోగి మహేష్ వైరల్ చేశాడు. దీంతో మానసిక వేదనకు గురై శశి ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

About The Author