శభాష్ కృష్ణా జిల్లా పోలీస్…


హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న కారు కంచికచర్ల సమీపంలోకి రాగానే హైవేలో అర్ధరాత్రి 12 గంటలకు కార్ టైర్ పంక్చర్ అవ్వగా,
రాత్రి గస్తీ తిరుగుతున్న కంచికచర్ల కానిస్టేబుళ్లు అది గమనించి హుటాహుటిన పంక్చర్ వేయించి వారిని గమ్యస్థానానికి చేరేందుకు సహకరించారు.
కారులో 80 ఏళ్ళ ముదుసలి, ఇద్దరు మహిళలు , నగదు ఉండటంతో ఎంజరుగుతుందోనన్న భయంతో ఆ పెద్దాయన ఎన్ని వాహనాలు ఆపినా అర్ధరాత్రి అవ్వడంతో ఎవరూ పట్టించుకోలేదు.
ఈ సమయంలో పోలీసు వారొచ్చి మేమున్నాం మీరు భయపడకండి అని ధైర్యం చెప్పి అక్కడ కానిస్టేబుల్ రవీంద్ర వారికి తోడుగా ఉండి, కానిస్టేబుల్ శ్యాం కంచికచర్ల వెళ్లి మెకానిక్ వెంటపెట్టుకుని తీసుకొచ్చి టైరును పంక్చర్ వేయించి సురక్షితంగా వారిని గమ్యస్థానంకు చేర్చారు కృష్ణా జిల్లా పోలీసులు.
విషయం తెలుసుకున్న జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ బాబు IPS., గారు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు నగదు రివార్డులు అందించి, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టి పోలీస్ ప్రతిష్టను ఇనుమడింప చేయాలన్నారు. రివార్డులు అందుకొన్న కానిస్టేబుళ్లు 1. K. శ్యామ్ కుమార్ PC- 796, 2.B.రవీంద్ర PC-125

About The Author