విధి ఎంత క్రూరమైనది….? 14 రోజుల్లో కుటుంబాన్ని మింగేసింది…


రెండు వారాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ‘డెంగీ’ వ్యాధికి బలయ్యారు. మంచిర్యాలకు చెందిన టీచర్ రాజగట్టు(30), ఆయన తాత లింగయ్య,(70) రాజగట్టు కూతురు వర్షిణి(6), చివరగా రాజగట్టు భార్య సోని డెంగీకి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సోని 9నెలల గర్భవతికాగా మంగళవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. డెంగీ వ్యాధితో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం కన్నుమూసింది. ఒకే కుటుంబంలో నలుగురు రెండు వారాల్లో డెంగీ వ్యాధితో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

About The Author