ఇసుక కొరత తాత్కాలికమే : ముఖ్యమంత్రి


ఇసుక కొరతపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వ్యాఖ్యలు
ఇసుక అన్నది తాత్కాలిక సమస్య: సీఎం
90 రోజులుగా ఊహించని రీతిలో వదర వస్తోంది: సీఎం
265కిపైగా రీచ్‌ల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయి: సీఎం
మిగతా రీచ్‌లన్నీ వరదనీటిలో ఉన్నాయి:
అక్కడ నుంచి ఇసుక తీయడం కష్టంగా ఉంది, లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి:
90 రోజులుగా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి చివరకు పెన్నా నదిలో కూడా వరద వస్తోంది:
ఇలా నీళ్లు రావడం రైతులకు, పంటలకు, భూగర్భజలాలకు మంచిదే :
కాకపోతే నిరంతరం వరద వల్ల ఇసుక సమస్య వస్తోంది:
గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచింది:
పొక్లెయిన్‌లతో, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేశారు:
ఇప్పుడు మనం మాన్యువల్‌గా చేస్తున్నాం:
ఇప్పుడు మీరు ప్రకాశం బ్యారేజీకి వెళ్లిచూసినా.. గేట్లు ఎత్తే ఉన్నాయి, వరదనీరు ప్రవహిస్తూనే ఉంది:
నవంబర్‌ నెలాఖరు నాటికి పూర్తిగా సమస్య తీరుతుందని భావిస్తున్నాం:
గత ఐదేళ్లలో పేరుకే ఇసుక ఫ్రీ అని చెప్పారు, మాఫియా నడిపారు:
ఇప్పుడు మేం చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నాం:
ప్రజలకు, పేదలకు మేలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించాం:
కిలోమీటర్‌కు రూ.4.90 లకు ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నాం:
వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతుంది:
ప్రాధాన్యతా రంగాలకు ఇసుక ఇవ్వడానికి వెంటనే ప్రత్యేక స్టాక్‌యార్డులు కూడా ఇస్తాం:
ఇసుక అన్నది తాత్కాలిక సమస్య మాత్రమే: సీఎం

About The Author