మాజీ రాష్ట్రపతి,భారత రత్న డా||అబ్దుల్ కలాం కు అవమానం..


మాజీ రాష్ట్రపతి, భారత రత్న దివంగత డా||అబ్దుల్ కలాం ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేధావులు, విశ్లేషకులు…

10వ తరగతి పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రతి ఏటా #జాతీయవిద్యాదినోత్సవం అయిన అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు నాడు , “Dr. A. P. J Abdul kalam Pratibha Puraskar” పేరిట అవార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ పేరుని “YSR Vidya Puraskar” గా మారుస్తూ GO విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని, ప్రథమ పౌరుడిగా, #మిసైల్‌మ్యాన్‌ఆఫ్‌ఇండియా గా విశ్వఖ్యాతిని గడించిన ఓ గొప్ప దార్శనికుడి పేరు మీద, విద్యార్ధుల్లో స్ఫూర్తిని నింపడానికి ఇచ్చే ప్రతిభా పురస్కారాల పై కూడా రాజకీయ నీలినీడలు ఆవరించడం దురదృష్టకరం…

#DrAPJAbdulKalam #MissileManOfINDIA #DrYSRVidyaPuraskar #GovtOfAP #YSRCP

About The Author