శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం…


టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్ర‌స్టుకు విరాళాలందించే దాత‌ల కోసం న‌వంబ‌రు 4న ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభించామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వారంలో శుక్ర‌వారం 200 బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు, మిగ‌తా రోజుల్లో 500 బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన‌ట్టు తెలిపారు. డిసెంబ‌రు 31వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ కోటాను విడుద‌ల చేశామ‌న్నారు. న‌వంబ‌రు 4న మొద‌టిరోజు ఏడుగురు దాత‌లు రూ.10 వేలు చొప్పున విరాళం అందించి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్నార‌ని వివ‌రించారు. అక్టోబ‌రు 21 నుండి ఇప్ప‌టివ‌ర‌కు 1109 మంది దాత‌లు రూ.1.10 కోట్లు విరాళాలు అందించార‌ని తెలియ‌జేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప

About The Author