తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు గురువారం,07.11.2019ఉదయం 6 గంటలసమయానికి,నిన్న 65,024మందిభక్తులకు కలియుగ దైవంశ్రీవేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనంకోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లో 01గదిలో భక్తులు వేచిఉన్నారు,

ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు06గంటలుపట్టవచ్చును,

నిన్న స్వామివారికిహుండీలో భక్తులుసమర్పించిన నగదు₹: 2.36 కోట్లు,

శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్₹:300/-), దివ్యదర్శనం కాలినడక వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగారెండు గంటల సమయంపట్టవచ్చును,

గమనిక:

10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికిశ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒకవిఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి,

వయోవృద్దులు / దివ్యాంగుల

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

సుపథం మార్గం గుండాశ్రీవారి దర్శనానికిఅనుమతిస్తారు, ఉ:11నుండి సా: 5 గంటలవరకు దర్శనానికిఅనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి

 

About The Author