మామిడి తోటను అమ్మవద్దన్న భార్యను నరికి హత్య చేసిన కసాయి భర్త

రాయచోటి పట్టణంలోని కొత్తపేట చైతన్య స్కూల్ సమీపంలో రాత్రి 12.20 గంటల సమయంలో ఖాదర్ వలి (46) అనే వ్యక్తి తన భార్య నూర్జహాన్ ను అతి దారుణంగా కోడవలి తో తల పైన నరికి చంపి, ఆ తరువాత అడ్డుకో బోయిన కొడుకు మహమ్మద్ రఫీ ని కూడా చంపేందుకు ప్రయత్నించగా కొడుకు కు కూడా స్వల్ప గాయం అయింది. భార్య ,కొడుకు ఇద్దరూ లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల రెడ్డివారిపల్లి గ్రామంలోని తన మామిడి తోట అమ్మవద్దన్నందుకు ఖాదర్ వలి ఈ దారుణానికి పాల్పడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ రాజు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకొని జరిగిన సంఘటన పై ఆరా తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

About The Author