భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేసిన తండ్రి

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది  గుమ్మల్ల చిన్న పుల్లయ్య అనే వ్యక్తి భార్యపై అనుమానంతో 8 నెలల కన్నకొడుకుని హేమంత్ కుమార్ ని నేలకేసి కొట్టి చంపిన తండ్రి

రమాదేవి భార్యపై అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు భార్యను కత్తితో గాయపరచడం మే కాకుండా రోకలి బండతో దారుణంగా దాడి చేశాడు

తీవ్రంగా గాయపడ్డ భార్యను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అమే పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది 

గతంలో కూడా చిన్న పుల్లయ్య అర్ధవీడు మండలం మోహదిపురం లో మొదటి భార్య గుమ్మల్ల లక్ష్మీదేవి అనే మహిళ వివాహం చేసుకొని  అనుమానంతో గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటనలో ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు

రెండు సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్న పుల్లయ్య అనుమానంతో తన కొడుకుని చంపడమే కాకుండా భార్యను తీవ్రంగా గాయపరిచాడు 

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు పరారీలో ఉన్నాడని నిందితున్ని త్వరలో పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని CI సుధాకర రావు వెల్లడించారు.

About The Author