విద్యార్థిని ప్రాణం తీసిన సెల్ఫీ

గుంటూరు జిల్లా : గలగలాపారే కృష్ణా జలాలతో స్వీయచిత్రం తీసుకొనే ప్రయత్నంలో బీటెక్‌ విద్యార్థిని ప్రాణాలు కోల్పో యింది. సముద్రం, నదులు, వాగుల వద్ద సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో గుంటూరు జిల్లా నకరికల్లు మండ లం కండ్లగుంట వద్ద చోటుచేసుకున్న ఘటనతో మరో సారి నిరూపిత మైంది.

వివరాలు.. 

నరసరావుపేట పట్టణం వెంగళ్‌ రెడ్డినగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని ఐలా ధనలక్ష్మీ(20) స్నేహితులతో కలిసి కండ్లగుంటకు బయలుదేరింది. మార్గం మధ్యలో గుంటూరు బ్రాంచ్‌ కెనాల్ వంతెనపై సెల్పీ తీసుకోవాలనుకుంది. స్నేహితుడు ముఖేశ్‌తో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరూ కాలువలో పడిపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు వెంటనే అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ముఖేశ్‌ ప్రాణాలతో బయటపడగా..ధనలక్ష్మిని ఒడ్డుకు చేర్చినప్పటికీ  తీవ్ర అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. శుభకార్యానికి వెళుతూ కుమార్తె విగతజీవిగా మారడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

About The Author